సౌత్ ఇండియాలో ఉన్న టాలెంటెడ్ దర్శకుల్లో ఏఆర్ మురుగదాస్ కూడా ఒకరు. ఆయన తెరకెక్కించే సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. సందేశాత్మక సినిమాలు తెరకెక్కించడంతో మురుగదాస్ సిద్ధ హస్తుడు. తెలుగు, తమిళమే కాకుండా బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుకున్నాడు. దర్శకుడిగా సినిమాలు తీయడంతో పాటు 2011లో నిర్మాతగా ఓ తమిళ సినిమా కూడా నిర్మించాడు. ప్రస్తుతం ఆయన ఓ వెబ్ సిరీస్ ను ప్లాన్ చేస్తున్నాడని కోలీవుడ్ సమాచారం. లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ గా ఈ వెబ్ సిరీస్ రానుందని తెలుస్తోంది.

 

 

అయితే మురుగదాస్ ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం చేయడం లేదట. నిర్మాతగా మత్రమే వ్యవహరిస్తున్నాడని అంటున్నారు. ప్రస్తుతం దీనిపై వర్క్ జరుగుతోందని అంటున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల కోసం ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఈ లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ లో హీరోయిన్ గా వాణీ భోజన్ ను తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఓ మై కాదవులే అనే తమిళ సినిమా ద్వారా ఈ భామ తెరంగేట్రం చేసింది. ఈ భామ తెలుగులో విజయ్ దేవరకొండ నిర్మాతగా వచ్చిన మీకు మాత్రమే చెప్తా సినిమాలో తరుణ్ భాస్కర్ సరసన నటించింది.

 

 

లాక్ డౌన్ సమయాన్ని సినిమా స్క్రిప్ట్ పనులు పూర్తి చేసే పనిలో ఉన్నాడట మురుగదాస్. లాక్ డౌన్ పరిస్థితులు తొలగిపోతే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ను జూన్ లో ప్రారంభించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ సిరీస్ ను నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. దీనిపై అఫీషియల్ న్యూస్ త్వరలో రివీల్ చేస్తారని తమిళ సినీ వర్గాల సమాచారం. రజినీకాంతో మురుగదాస్ తెరకెక్కించిన దర్బార్ సత్ఫలితాలను ఇవ్వలేదు. త్వరలో విజయ్ తో సినిమా ప్లాన్ చేశాడు మురుగదాస్.

మరింత సమాచారం తెలుసుకోండి: