టాలీవుడ్ లో సూపర్ హిట్ మూవీ ‘గీతగోవిందం’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఇప్పటి వరకు మరో సినిమాను పట్టాలెక్కించలేకపోయాడు డైరెక్టర్ పరశురామ్.  ఈ మూవీతో సెన్సేషన్ హీరో విజయ్ దేవరకొండ అందాల భామ రష్మీకకు ఎంతో మంచి పేరు వచ్చింది. ఈ హీరో హీరోయిన్లు టాలీవుడ్ లో తెగ బిజీ అయ్యారు.  అయితే పరుశరామ్ మాత్రం ఇప్పటి వరకు తన తదుపరి సినిమా ప్రకటించలేదు.  తాజాగా  'గీతగోవిందం' తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయాలనుకుని ఆయనకు కథ కూడా చెప్పాడు. అయితే అప్పుడు మహేష్ ఖాళీ లేకపోవడంతో కుదరలేదు. తాజాగా మహేష్ సినిమా ఓకే అయ్యిందని చెప్పేసాడు పరుశురాం. వాస్తవానికి పరుశరామ్.. అక్కినేని నాగ చైతన్యతో ‘నాగేశ్వరరావు’ మూవీ తీయబోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

 

ఈ లోగా మహేష్ తో మూవీ ఓకే కావడంతో ఆ ప్రాజెక్ట్ పక్కన బెట్టారని.. పరశురామ్ ఈ విధంగా చేయడం పట్ల నాగార్జున కోపంగా ఉన్నారనీ, ఆ ప్రాజెక్టు ఆగిపోయినట్టేననే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. తాజాగా ఈ విషయం పై స్పందించిన ఆయన చైతూతో నేను చేయవలసిన సినిమా ఆగిపోలేదు. మహేశ్ బాబుతో సినిమా పూర్తయిన తరువాత, 'నాగేశ్వరరావు' పట్టాలెక్కుతుంది.  మహేష్ తో సినిమా చేస్తున్నా, ఆయనతో సినిమా కోసం చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అని అన్నారు.

 

ఇక ఒక్కడు సినిమా చుసిన తర్వాతే తనకు ఇండస్ట్రీలోకి రావాలనిపించిందని.. ఇప్పుడు మహేష్ కోసం అదిరిపోయే కథను తాయారు చేసానని చెప్పుకొచ్చారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత చైతూ కెరియర్లో బెస్ట్ మూవీ అందించబోతున్నానని అన్నారు. అక్కినేని ఫ్యామిలీతో నాకు సన్నిహిత సంబంధాలు వున్నాయి. నాపై నాగార్జునగారికి కోపం వచ్చిందనే ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు అని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: