ఆరెక్స్  100 సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటిన అజయ్ భూపతి తన నెక్స్ట్ సినిమాను శర్వానంద్, సిద్ధార్థ్ లతో తీస్తున్న విషయం తెలిసందే. మహా సముద్రం టైటిల్ తో వస్తున్నా ఈ సినిమా క్రేజీ మల్టీస్టారర్ గా వస్తుందని తెలుస్తుంది. నితిన్, రామ్ ల దగ్గర నుండి నాగ చైతన్య వరకు మహా సముద్రం కథ వినడం చేయలేమని చెప్పడం జరిగింది. అందుకే అప్పట్లో హీరోల మీద ఫైర్ అవుతూ కామెంట్ చేశాడు. ఎలాగోలా శర్వానంద్ ఈ కథను ఒకే చేసి అజయ్ కు ఛాన్స్ ఇచ్చాడు. 

 

అయితే లాక్ డౌన్ టైంలో ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ తో చాట్ చేసిన అజయ్ భూపతి ఆరెక్స్ 100 సీక్వల్ ఉంటుందని రివీల్ చేశాడు. సేమ్ కాస్ట్ అండ్ క్రూతోనే ఆరెక్స్ 100 సీక్వల్ ఉంటుందని చెప్పాడు. చిట్ చాట్ లో భాగంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ మా దేవుడుతో సినిమా ఎప్పుడు చేస్తారని అడిగితె మీద దేవుడు ముందు కమిట్ అయినా సినిమాలు చేసేసరికి టైం సరిపోతుంది. నా సినిమా ఓకే చేసినా అది సెట్స్ మీదకు వెళ్ళడానికి 10 ఏళ్ళు పడుతుందని అన్నాడు. అంటే పవన్ సినిమా లేట్ అవుతుందని అర్ధంతో అజయ్ అలా మాట్లాడి ఉండొచ్చని అంటున్నారు. 

 

ఇక సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్ ఒకరు మా హీరోతో సినిమా చేస్తా అని అడిగితె ఆల్రెడీ మహేష్ కు కథ చెప్పానని.. అయితే కొన్నాళ్ళు టైం కావాలని అన్నట్టు చెప్పాడు అజయ్ భూపతి. బహుశా ఇంకొన్ని సినిమాలు చేశాక ఛాన్స్ ఇస్తాడు కావొచ్చని అజయ్ భూపతి అన్నారు. ఇలా పవర్ స్టార్, సూపర్ స్టార్ గురించి సెటైరికల్ గా మాట్లాడి వాళ్ళ ఫ్యాన్స్ కు టార్గెట్ అవుతున్నాడు అజయ్ భూపతి. మహాసముద్రం హిట్ అయితే పర్వాలేదు కానీ తేడా వస్తే మాత్రం అజయ్ భూపతి కెరియర్ రిస్క్ లో పడ్డట్టే. 

మరింత సమాచారం తెలుసుకోండి: