తెలుగు సినిమాకు ఇప్పుడు మంచి బూస్ట్ అవసరం అనేది అర్ధమవుతుంది. లాక్ డౌన్ సమయంలో ఏ సినిమా కూడా ముందుకు వెళ్ళే అవకాశం లేదు. మరి సినిమాలు విడుదల అయిన తర్వాత ఏ సినిమా విడుదల చేస్తే మంచిది అనే ఆలోచన లో నిర్మాతలు పడ్డారు. ముందు ముందుగా చిన్న చిన్న హీరోల సినిమాలు విడుదల చేస్తే చప్పగా ఉండే అవకాశం ఉంది అనే భావన నిర్మాతల్లో కూడా ఉంది. దీనితో ఇప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించి సినిమాలను చేస్తున్నారు. ఏ సినిమా విడుదల చెయ్యాలో అర్ధం కాని స్థితి లో ఉన్నారు. 

 

ముందు స్టార్ హీరోల సినిమాలను విడుదల చెయ్యాలి అనే భావన లో టాలీవుడ్ జనాలు ఉన్నారని అంటున్నారు. లాక్ డౌన్ తర్వాత జనాలు అందరూ కూడా ఒక మంచి సినిమా కోసం ఎదురు చూసే అవకాశం ఉందని అందుకే అందరూ నిర్మాతలు కూర్చుని మాట్లాడుకుని ఒక పెద్ద సినిమాను విడుదల చేసే అవకాశం ఉందని టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. మరి ఏ సినిమా విడుదల చేస్తారో తెలియదు. ప్రస్తుత తెలుగులో ఏ అగ్ర హీరో సినిమా కూడా రెడీ గా లేదు. ఒక్క ఆర్ఆర్ఆర్ సినిమా మాత్రమే షూటింగ్ ని దాదాపుగా పూర్తి చేసుకున్నా అది వచ్చే ఏడాది విడుదల అవుతుంది. 

 

అందుకే ఇప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచన చేసి సినిమాను విడుదల చేయకపోతే మనం నష్టపోయే అవకాశం ఉంటుంది అనే భావన లో నిర్మాతలు కూడా ఉన్నారని అంటున్నారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాను రెడీ చేస్తున్నారు ఇక లాక్ డౌన్ ని ఎత్తివేసినా సరే జనాలు అందరూ ఒక చోట కు వచ్చే సినిమాను ఏ విధంగా అనుమతిస్తారు అనేది దాదాపుగా చెప్పలేని పరిస్థితి నెలకొంది ఇప్పుడు. చూడాలి...

మరింత సమాచారం తెలుసుకోండి: