లాక్ డౌన్ అంటే అందరికీ రెస్టే. ఓ విధంగా ఫుల్ బిజీగా ఉన్న వారికి బోర్ కొడుతుంది. జీవితం ఆగిపోయినట్లుగా ఉంది. బాగా ఖాళీగా ఉన్నట్లుగా  సెలిబ్రిటీల కధ తయారైంది. వారు ఏం చేస్తున్నారో వారికే అర్ధం కావడంలేదులా ఉంది. కొంతమంది తన ఇన్స్టాగ్రాం లో  రెచ్చగొట్టే  పిక్స్ పెడుతున్నారు, ఇక  వాటిని చూస్తూ ఫ్యాన్స్ ఇలా ఒక రకమైన కొత్త సినిమాను చూసేస్తున్నారు.

 

ఇవిలా ఉంటే కొందరు సినీ  భామలు ఫ్యాన్స్ తో లైఫ్ డిస్కషన్ పెడుతున్నారు. వారి ప్రశ్నలకు సమాధానం చెబుతున్నారు. ఇక కొంటే ఫ్యాన్స్ అడుగుతున్న ప్రశ్నలు కొందరికి చికాకు పెడితే కొందరు అందగత్తెలు తెలివిగా వాటిని సమాధానం చెబుతున్నారు. అందులో ముదురు భామ త్రిష కూడా ఉంది. రెండు దశాబ్దాల క్రితం తన సినీ అరంగేట్రం చేసిన త్రిషకు ఇపుడు పెద్దగా అవకాశాలు లేవు కానీ ఆమె సీనియర్ హీరోలకు మాత్రం షాక్ ఇస్తోంది.

 

తాజాగా త్రిష తన ఇన్స్టాగ్రాం లో ఫ్యాన్స్ కి పెద్ద పరీక్ష పెట్టింది. ఓ విధంగా ఇది పోటీ అనాలేమో. తనతో డేటింగ్ చేయలనుకునే ఫ్యాన్స్ ఉంటే అయిదు వందల పదాలతో మంచి వ్యాసం తనగురించి రాయాలని, తనకు ఇబ్బందిలేకుండా ఎలా చూసుకుంటారో అందులో రాయాలని పరీక్ష పెట్టింది.

 

మరి ఈ పరీక్షలో ఎవరు నెగ్గుతారో చూడాలి. నిజంగా త్రిష కొంటెగానే ఈ పరీక్ష పెట్టిందనుకోవాలి. ఇక మరో భామ ఉంది ఆమె రష్మిక. ఆమెను పెళ్ళి చేసుకోవాలంటే వారింటి బొచ్చు కుక్క పర్మిషన్ కావాలంట. ఇది కూడా ఆమె ఫ్యాన్స్ తో మాట్లాడుతూ చెప్పిన సీక్రెట్. మొత్తానికి  చూసుకుంటే అందమైన భామలు కొందరు తమ పిక్స్ తో పిచ్చెక్కిస్తూంటే కొందరు తమ సమాధానాలతో వెర్రెక్కించేస్తున్నారు.

 

లాక్ డౌన్ ముగిసి జన జీవితం సాధారణ స్థితికి చేరుకునేలోగా ఇలాంటివి ఎన్ని పరీక్షలు ఉంటాయో. మరెన్ని పోటీలు ఉంటాయో. ఏమైనా వారు తారలు. నింగిన ఉంటారు. వారిని అందుకోవాలన్న అభిమానుల ఆశలకు ఎన్ని నిచ్చెనలు వేసినా సరిపోవు. ఈ సత్యం తెలుసుకునేలోగా లాక్ డౌనే కాదు, లైఫే ముగిసిపోతుందేమో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: