అక్కినేని ఫ్యామిలీలో ప్రస్తుతం ఫామ్ లో ఉన్న హీరో నాగ చైతన్య. లాస్ట్ ఇయర్ మజిలీ, వెంకీ మామ సినిమాతో హిట్ అందుకున్న చైతు ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరక్షన్ లో లవ్ స్టోరీ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తర్వాత నాగ చైతన్య, విక్రమ్ కుమార్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని ఫిల్మ్ నగర్ టాక్. సినిమా కథ చైతూకి చెప్పడం.. దానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందట. 

 

నాని గ్యాంగ్ లీడర్ తర్వాత విక్రమ్ కుమార్ చేస్తున్న ఈ సినిమాకు టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. చైతన్యతో థ్యాంక్యూ అనిపిస్తున్నాడట విక్రమ్ కుమార్. స్టోరీ కూడా విక్రమ్ మార్క్ ఎంటర్టైనర్ గా ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో పాటుగా పరశురామ్ డైరక్షన్ లో నాగ చైతన్య సినిమా చేయాల్సి ఉంది. అయితే చైతు కన్నా ముందు పరశురామ్ సూపర్ స్టార్ మహేష్ తో సినిమా చేస్తాడని తెలుస్తుంది. మహేష్ సినిమా తర్వాత పరశురామ్ కచ్చితంగా నాగ చైతన్యతో సినిమా చేస్తాడని అంటున్నారు. 

 

ఆల్రెడీ చైతు కోసం నాగేశ్వర రావు టైటిల్ తో కథ సిద్ధం చేశాడు పరశురామ్ ఈ కథకు చైతు, నాగార్జునల నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిందట ఓ పక్క అఖిల్ ఇంకా హిట్ ఖాతా తెరవకపోవడం.. నాగార్జున కూడా కెరియర్ లో వెనుకపడటం చైతూకి కలిసి వచ్చింది. లాస్ట్ ఇయర్ రెండు సూపర్ సక్సెస్ లు అందుకున్న నాగ చైతన్య శేఖర్ కమ్ముల లవ్ స్టోరీతో కూడా కచ్చితంగా హిట్టు కొట్టేలా ఉన్నాడు. రాబోయే సినిమాకు కూడా చైతు ఇమేజ్ పెంచేలా ఉన్నాయి. చూస్తుంటే అక్కినేని హీరో కెరియర్ గాడిలో పడినట్టే ఉందని చెప్పొచ్చు. 
   
 

మరింత సమాచారం తెలుసుకోండి: