టాలీవుడ్ లో మహేష్ బాబు కి ఏ స్థాయిలో క్రేజ్ ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. టాలీవుడ్ లో ఆయన తో సినిమా చేయడానికి ఎందరో దర్శకులు ముందుకు వస్తు ఉంటారు. కాని ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడా కనపడటం లేదు. చిన్న చిన్న హీరోలతో అయిన ఆసినిమా చెయ్యాలి అని అనుకుంటున్నారు గాని మహేష్ తో సినిమా చేయడానికి మాత్రం ముందుకు రావడం లేదు చాలా మంది దర్శకులు. మహేష్ బాబు ఇప్పుడు ఏ సినిమా చెయ్యాలో అర్ధం కాని స్థితిలో ఉన్నాడు. ముందు వంశీ పైడపల్లి తో సినిమా చెయ్యాలి అనుకున్నా కథ రెడీ గా లేదని ఆగిపోయాడు. 

 

వంశీ కూడా కథ విషయంలో అంత సీరియస్ గా లేరు అనే విషయం మహేష్ బాబుకి అర్ధమై అతన్ని పక్కన పెట్టి పరుశురాం కి ఫోన్ చేసి సినిమా చెయ్యాలని కోరినట్టు వార్తలు వచ్చాయి. ఆయన కూడా కథ విషయంలో ఏ స్పష్టతా ఇవ్వడం లేదు. మహేష్ డిమాండ్ కి తగిన విధంగా ఆ కథ ఉండాలి. అలా చేయలేను అని ఆయన డ్రాప్ అయ్యాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది. అనీల్ రావిపూడి తో మహేష్ బాబు గొడవ పడినట్టు సమాచారం. దానికి కారణం ఏంటీ అనేది తెలియదు గాని అనీల్ తో మహేష్ కి పెద్ద గొడవ అయింది అంటున్నారు. 

 

అనీల్ ఇప్పుడు కథ రెడీ చేస్తా అని మహేష్ కి చెప్పి డ్రాప్ అయినట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇది ఎంత వరకు నిజ౦ అనేది తెలియదు గాని దీని మీద స్పష్టత రావడం లేదు. ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది అని చెప్తున్నారు. మహేష్ ముందుకు వచ్చినా అనీల్ కథ రెడీ చేయడం లేదట

మరింత సమాచారం తెలుసుకోండి: