యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రానికి 'రాధేశ్యామ్' అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేయాలనుకుంటున్నారు. ఇదే టైటిల్ ని ఫైనల్ చేసి లాక్ డౌన్ తర్వాత ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ అండ్ టీజర్ ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కాని కరోనా కారణంగా డిలే అయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాను పీరియాడికల్ బ్యాగ్డ్రాప్ లో అద్భుతమైన ప్రేమ కథ గా రాధాకృష్ణ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటి వరకు ఇలాంటి ప్రేమ కథ ని ప్రభాస్ చేయలేదని విశ్వసనీయ సమాచారం. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా ప్రభాస్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. 

 

ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో రూపొందనున్న సినిమా అనౌన్స్ ఇప్పటికే వచ్చిన సంగతి తెలిసిందే. మహానటి తర్వాత నాగ్ అశ్విన్ ప్రభాస్ కాంబినేషన్  లో సినిమా అనగానే ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాని నవంబర్ లేదా డిసెంబర్ నుండి సెట్స్ మీదకి తీసుకు వెళ్ళాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేశారు. అయితే కరోనా మహమ్మారితో చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల్లో వచ్చే సంవత్సరానికి పోస్ట్ పోన్ అయింది.   

 

ఇక పాన్ ఇండియా రేంజ్ లో ప్రభాస్ కి మార్కెట్ ఉంది కాబట్టి ఈ సినిమాని అదే స్థాయిలో నిర్మించనున్నారు. అంతేకాదు ఈ సినిమా వైజయంతి మూవీస్ సంస్థ కి 50 వ సినిమా కావడం విశేషం. ఇక నాగ్ అశ్విన్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ మీద బిజీగా ఉన్నారు. ఈ ఇయర్ డిసెంబర్ లోపు పక్కాగా స్క్రిప్ట్ రెడీ ప్రభాస్ తో చర్చలు జరపనున్నాడట. అంతేకాదు ఒకేసారి నాలుగు భాషల్లో తెరకెక్కించే విధంగాను ఈ స్క్రిప్ట్ ని సిద్దం చేస్తున్నాడట నాగ్ అశ్విన్. ఇక భారీ కాన్వాయిస్ తో నిర్మించబోయో ఈ సినిమాని దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: