అమలా పాల్.. ఎంత బోల్డ్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తను సోషల్ మీడియాలో కానీ నిజ జీవితంలో కానీ ఏదైనా ఒకటి చేసింది అంటే చాలు... వామ్మో అమలాపాల్ తెగించేసింది రోయ్ అని అనేస్తారు.. అలాంటి తెగింపు ఉన్న అమలాపాల్ ఓ తొందరపాటు నిర్ణయం తీసుకుంది. అదే పెళ్లి నిర్ణయం. 

 

అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న ఈ మలయాళ బ్యూటీ సినీ జీవితమే బాగుంది.. ఆమె వ్యక్తిగత జీవితం కోసం తీసుకున్న నిర్ణయాలు ఏలాంటివి కూడా మంచివి కాకపోయాయ్. అయితే ఆమె పెళ్లి ఎంత త్వరగా చేసుకుందో.. అంతే తొందరగా విడాకులు కూడా తీసుకుంది.. 

 

అసలు విషయానికి వెళ్తే.. మంచి హిట్స్ అన్నప్పుడే ఆమె ప్రేమించిన దర్శకుడు ఏఎల్ విజయ్ ని 2014 లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఏమైందో తెలియదు.. ఇద్దరికీ మనస్పర్థలు వచ్చాయి.. దీంతో 2017లో విడిపోయారు.. ఇంకా ఆ తర్వాత అమలా పాల్ ఆమె మాజీ భర్త మరో పెళ్లి చేసుకుని జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు.. ఇక ఇటు అమలా పాల్ మాత్రం పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉంటూ సినిమాల్లో ఫుల్ బిజీ అయ్యింది. 

 

ఇలా అంత సాఫీగా జరిగిపోతుంది.. ఇంకా అలాంటి సమయంలోనే మాజీ భర్త తండ్రి మాజీ మామ అమలా పాల్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.. అసలు ఎం అని చేశాడు అంటే? విజయ్.. అమలా పాల్ విడిపోవడానికి ధనుష్ ఏ కారణం అని.. అందుకే విడిపోయారు అని అన్నారు. ధనుష్ ఎలా కారణం అంటే? రఘువరన్ బిటెక్ సినిమాలో అమలాపాల్ ధనుష్ తో విచ్చలవిడిగా రొమాన్స్ చేసింది అని.. అది ప్రశ్నించినందుకు విజయ్ తో గొడవలు పడ్డారు అని అలానే విడిపోయారంటూ చెప్పుకొచ్చారు.. ఏమైతేనేం అమలాపాల్ ప్రస్తుతం సింగల్ అంతే. 

మరింత సమాచారం తెలుసుకోండి: