రామ్ చరణ్ సినిమా సెలక్షన్  మారిపోతోంది. రొటీన్ సినిమాలు కాకుండా డిఫరెంట్ సినిమాలకు  ఓటేస్తున్నాడు . లాస్ట్ టైమ్ రంగస్తలంలో చెవిటి వాడిగా ఛాలెంజింగ్ రోల్ చేసి సక్సెస్ దక్కించుకున్న రామ్ చరణ్ .. ఇప్పుడు రాజమౌళి సినిమాలో అల్లూరి సీతారామరాజుగా హిస్టారికల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు . 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మల్టీ స్టారర్ మూవీ మీద ప్యాన్ ఇండియా వైడ్ గా విపరీతమైన ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.

 

జూనియర్ ఎన్టీఆర్, రామచరణ్ కాంబినేషన్లొ, రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ  "ఆర్ ఆర్ ఆర్" సినిమా షూటింగ్ ప్రస్తుతం  కోకా పెట్ లో జరుగుతోంది. రీసెంట్ గా ఈ సినిమా రిలీజ్ ఆరెనెలలు పోస్ట్ పోన్ అవ్వడంతో .. చరణ్ నెక్ట్స్ సినిమా మీద ఇప్పటినుంచే దృష్టి పెట్టాడు . అందుకే గ్యాప్ దొరికినప్పుడల్లా కథలు వింటున్నాడు .  ఇప్పటికే అనిల్ రావిపూడి, సురేందర్ రెడ్డి లాంటి తనతో సినిమా చేద్దామనుకుంటున్న డైరెక్టర్లతో మీటింగులు కూడా పెట్టేశాడు . వీళ్లందరూ కాకుండా భీష్మతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ వెంకీ కుడుములతో  సినిమా చేద్దామన్న ప్లాన్ లో కూడా ఉన్నాడట మెగా పవర్ స్టార్.

 

ఇలా రొటీన్ గా కాకుండా తనకెరీర్ లో ఎప్పుడూచెయ్యని ఎక్స్ పెరిమెంట్ చేద్దామనుకుంటున్నాడట  చరణ్. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకూ కొత్త దర్శకులతో సినిమా చెయ్యలేదు ఈ మెగా హీరో. ఎందుకొచ్చిన రిస్క్ అనుకుని ఆల్రెడీ ఎగ్జిస్టింట్ డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తూ వచ్చాడు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. అందుకే చరణ్ కూడా కొత్త డైరెక్టర్ తో సినిమా చేద్దామనుకుంటున్నాడట.

రీసెంట్ గా  కొత్త డైరెక్టర్ చెప్పినకథ  చరణ్ కి నచ్చడంతో దానికి కొన్ని చేంజెస్ చెప్పాడని, మైత్రిమూవీ మేకర్స్ లో భారీ బడ్జెట్ తో సినిమా తెరకెక్కబోతోందని టాలీవుడ్ లో రూమర్ నడుస్తోంది. ఈ రూమర్ నిజమైతే ..రామ్ చరన్ ఇప్పటి వరకూ ఉన్న తన కెరీర్ లో సేఫ్ జోన్ నుంచి బయటికొచ్చి  డేరింగ్ స్టెప్ తీసుకున్నట్టే  అంటున్నారు ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: