నాగచైతన్య హీరోగా నటించిన 'బెజవాడ' సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నటి అమలాపాల్. చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా తన నటనతో క్రేజ్ తెచ్చుకుంది. రామ్ చరణ్ తో 'నాయక్', అల్లు అర్జున్ తో 'ఇద్దరమ్మాయిలతో' చిత్రాలలో నటించి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. మెగా హీరోలతో నటించినా ఎందుకో కానీ ఇక్కడ చెప్పుకోదగ్గ అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో తమిళ, మళయాల ఇండస్ట్రీలపై దృష్టి పెట్టింది ఈ భామ. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే తమిళ దర్శకుడు విజయ్ ని పెళ్ళో చేసుకుని అందర్ని ఆశ్చర్య పరిచింది. కానీ వీరి బంధం ఎక్కువకాలం నిలబడలేదు. వీరి పెళ్లి మూన్నాళ్ళ ముచ్చటే అయింది. దీని మీద అప్పట్లో ఇండస్ట్రీలో పెద్ద చేర్చే జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజుల గ్యాప్ తీసుకొని తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. వి.ఐ.పి2, ఆమె చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలు పెద్దగా విజయం సాధించకపోయినా మంచి పేరును తెచ్చి పెట్టాయి.
ఇదిలా ఉండగా అమలాపాల్ ఒక వెబ్ సిరీస్ లో నటించబోతోంది అంటూ ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు సినిమా అంటే థియేటర్స్ లోనే చూడాలి అనే రోజులు పోయాయి. కరోనా దెబ్బతో.. అలాగే స్మార్ట్ఫోన్ల వాడకంతో నేటి యువతరం అభిరుచి కూడా అంతకన్నా వేగంగా మారుతుంది. ఇప్పుడు అందరూ డిజిటల్ స్ట్రీమింగ్ వైపే వెళ్తున్నారు. దాంతో ఫిల్మ్ ఇండస్ట్రీస్ కూడా డిజిటిల్ వైపు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే పెద్ద పెద్ద నిర్మాతలు సైతం వెబ్ సిరీస్ లను నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ హీరోయిన్లు కూడా డిజిటిల్ రంగం వైపు చూస్తున్నారు. కాగా అమలాపాల్ కూడా వెబ్ సిరీస్ లో నటిస్తోంది. హిందీలో మహేష్ భట్, జియో స్టూడియోస్ తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్లో ఆమె నటిస్తున్నారు. మొత్తానికి బాలీవుడ్లో నటించాలన్న తన కల తీరుతున్నందుకు అమలాపాల్ చాలా సంతోషంగా ఫీల్ అవుతుందట. ఇక ఇప్పటికే స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ వెబ్ సిరీస్ చేస్తుండగా.. ఆ మధ్యే సమంత కూడా ‘ది ఫ్యామిలీ మాన్’ అనే వెబ్ సిరీస్ రెండవ సీజన్ లో నటించింది. ప్రియమణి ఇప్పటికే రెండు వెబ్ సిరీస్ లలో నటించింది. ఇప్పుడు వీరి బాటలోనే అమలాపాల్ కూడా అడుగులు వేస్తోంది. మరి మన అమలాపాల్ అక్కడ కూడా సక్సెస్ అవుద్దేమో చూడాలి.