సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప సినిమా గురించి రోజుకో వార్త వస్తుంది. రంగస్థలం సినిమా తర్వాత సుకుమార్ చేస్తున్న పుష్ప మీద అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజైన బన్నీ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే మొదట్లో సుకుమార్ ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించాలని అనుకోలేదు.

 

 

బన్నీతో సినిమా అనుకున్నాకే పాన్ ఇండియా ప్లాన్ ని స్టార్ట్ చేశారట. అల వైకుంఠపురములో సినిమాకి ముందే పాన్ ఇండియా రేంజ్ లో సినిమా చేద్దామని అనుకున్నప్పటికీ అది సాధ్యం కాలేదు. అప్పట్లో బన్నీ ఆ విషయంలో బయటపడలేదు కూడా. అయితే అల వైకుంఠపురములో ప్రమోషన్ టైమ్ లో అల్లు అర్జున్ నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూలు ఇవ్వడంతో అలు అర్జున్ కి పాన్ ఇండియా సినిమా మీద ఇంట్రెస్ట్ ఉందని అర్థమైంది.

 

 

పుష్ప సినిమాతో బన్నీ కోరిక నెరవేరనుంది. అయితే పాన్ ఇండియా రేంజ్ సినిమా కోసం బాలీవుడ్ నటీనటులని పుష్ప సినిమాలో నటింపజేయాలని చూస్తున్నారు. అందులో భాగంగానే పుష్ప ఐటెం సాంగ్ కోసం బాలీవుడ్ భామని తీసుకోనున్నారట.సుకుమార్ సినిమాలో ఐటెం సాంగ్ ఉంటుందని అందరికీ తెలిసిందే. ఈ సినిమాలోనూ అద్భుతమైన ఐటెం సాంగ్ ఉంటుందట. 

 

 

ఆ ఐటెం సాంగ్ లో బన్నీతో స్టెప్పులు వేయడానికి బాలీవుడ్ హాట్ బ్యూటీనీ తీసుకోకున్నారని సమాచారం. గతంలో దిశా పటాని పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన లోఫర్ సినిమాలో వరుణ్ తేజ్ సరసన నటించింది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందుతోంది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: