హీరోయిన్ గా ఒకప్పుడు  తెలుగు సినీ పరిశ్రమలో ఒక ఊపు ఊపినటువంటి నటుల్లో రోజా ఒకరు. ఆ తర్వాత కొంతకాలం సినిమాల నుంచి విరామం తీసుకుని రాజకీయాల్లో అడుగు పెట్టీ ఎమ్మెల్యేగా రాణించి.. ఫైర్ బ్రాండ్ లేడీ‌గా పేరు తెచ్చ‌కున్నారు. మ‌రోవైపు టెలివిజన్ రంగంలోనూ తనదైన శైలిలో దూసుకుపోతోంది రోజా. ఇక రోజా హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం అయిన సినిమా ప్రేమ తపస్సు. ఈ చిత్రం త‌ర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్ర హీరోల‌ సరసన న‌టించి.. త‌న‌దైన అందం, అభిన‌యంతో ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. అయితే సినిమాల్లో కనిపించే రొమాన్స్, సెంటిమెంట్, లవ్ ఇదంతా కేవలం కల్పితం. నటీ నటులతో ఇవన్నీ చేయించేది దర్శకుడు. 

 

ఇలాంటివి చేయించే క్రమంలో ఒక్కోసారి దర్శకులు నిజంగానే హీరోయిన్లతో ప్రేమలో పడుతున్నారు. ప్రేమలో పడడమే కాదు చాలా మంది హీరోయిన్లు తాము ప్రేమించిన దర్శకులనే పెళ్లి చేసుకున్నారు. ఈ లిస్ట్‌లో రోజా కూడా ఒక‌రు. వాస్త‌వానికి రోజాని తమిళ చిత్ర పరిశ్రమకు `చెంబరుతి` చిత్రం ద్వారా పరిచయం చేసింది డైరెక్ట‌ర్ సెల్వమణి. ఈ చిత్రంలో ప్రశాంత్ కథానాయకుడిగా నటించారు. ఈ చిత్రం విజయవంతమై తమిళ చిత్ర పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ క్ర‌మంలోనే డైరెక్ట‌ర్‌ సెల్వమణి, రోజా మధ్య పరిచయం ఏర్పడింది. 

 

ఆ ప‌రిచ‌యం కాస్త‌.. ప్రేమ‌గా మారి.. చివ‌ర‌కు మూడు ముళ్ల బంధంతో 2002లో ఒక్కటయ్యారు. అయితే రోజా, సెల్వమణి వివాహం జరిగిన విషయం అందరికీ తెలిసిన విషయమే కానీ, వీరిద్దరి మధ్య ప్రేమాయణం ఎలా కొనసాగిందన్న విషయం మాత్రం ఎవరికీ తెలియదు. వాస్త‌వానికి సెల్వమణి రోజాను ప్రేమించిన విషయాన్ని ముందుగా రోజాకు కాకుండా రోజా తండ్రి దగ్గరకు వెళ్లి చెప్పారట. రోజా తండ్రిన ఒప్పించుకుని ఆ తర్వాత రోజాకు విషయం చెప్పాడట సెల్వమణి. ఇక‌ రోజా కూడా సెల్వమణి  ప్రేమ‌ కోసం చాలా కష్టపడింద‌ట‌. ఆయన కోసం తమిళం మాట్లాడటం, చదవడం కూడా నేర్చుకుందట. చివ‌ర‌కు ప్రేమించిన ద‌ర్శ‌కుడినే పెళ్లాడి.. లైఫ్‌ను హ్యాపీగా ర‌న్ చేస్తున్నారు.
 
 
  

మరింత సమాచారం తెలుసుకోండి: