ఒకరు ఎదుగుతున్నారు అంటే మరొకరు పడిపోతున్నారని అర్థం. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఎవరి తలరాత ఎలా మారుతుందో ఎవరం చెప్పలేము. రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటున్నాయని అర్థమవుతుంది. ఈటీవీలో పటాస్ ప్రోగ్రాం ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన లేడీ యాంకర్ శ్రీముఖి. ఈ కార్యక్రమాన్ని శ్రీముఖి చాలా రోజుల వరకు విజయవంతంగా కొనసాగించింది అనే చెప్పాలి. ఆ తర్వాత పటాస్ నుంచి బయటకు రావడం జరిగింది. ఆ తర్వాత బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ గా మంచి పేరు ప్రత్యేకతలు తెచ్చుకుంది. ఈ రియాల్టీ షోలో శ్రీముఖి చివరి వరకు పోరాడిన కానీ టైటిల్ మాత్రం గెలుచుకోలేకపోయింది. అయితే రన్నరప్ తో సరిపెట్టుకుంది శ్రీముఖి. 

 


ఇంకా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత శ్రీముఖి చాలా మంచి ఆఫర్లే వస్తున్నాయి అని చెప్పాలి. ఈ తరుణంలోనే తాజాగా శ్రీముఖి మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆన్ టీవీ అనే అవార్డును సొంతం చేసుకుంది.  ఇలా బిజీగా కొనసాగుతున్న జీవితం తను OTT డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి అడుగు పెట్టాలని ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే తనకు కలిసొచ్చే మిగితా యాంకర్లను జత చేసుకుని ఆన్లైన్లో అదిరిపోయే షోస్ ప్లాన్ చేస్తుందట. ఇక లాక్ డౌన్ ముగిసిన తర్వాత శ్రీముఖి చేసే ఆలోచనలతో మార్పులు కచ్చితంగా చోటుచేసుకుంటాయన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు.

 

ముందుగా సుడిగాలి సుధీర్ పై పడే అవకాశాలు కనిపిస్తున్నాయట. సుధీర్ ప్రస్తుతం జబర్దస్త్ తోపాటు పోవే పోరా ప్రోగ్రాంలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. పోవే పోరా ప్రోగ్రాంలో లేడి యాంకర్ గా విష్ణుప్రియ చేస్తుంది. ఇంకా మన బుల్లితెరలో శ్రీముఖి, విష్ణుప్రియలు ఎక్కువ రెమ్యూనరేషన్ తో షోలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే తరహా ముందుకు వెళ్తే ఇదే బాటలో చాలామంది యాంకర్ లకు దెబ్బ పడే అవకాశాలు ఉన్నాయట. ఇక రాబోయే కాలంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో వేచి ఉండాల్సిందే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: