సౌతిండియా సినీ ఇండస్ట్రీలో గ్లామర్ డాల్ గా పేరు పొందిన హీరోయిన్ ప్రియమణి. 2003వ సంవత్సరంలో ఎవరే అతగాడు అనే సినిమాతో తెలుగు సినిమా తెరపై ప్రియమణి రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో అవకాశాలు దక్కించుకొని ప్రేక్షకుల చేత గ్లామర్ బ్యూటీ గా పేరు తెచ్చుకుంది. ఎన్టీఆర్ హీరోగా నటించిన యమదొంగ సినిమాలో కీలక రోల్ ని ప్రియమణి పోషించి తెలుగు ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకుంది ఈ బ్యూటీ. అయితే ప్రస్తుతం బుల్లితెరపై పలు షోలలో జడ్జిగా వ్యవహరిస్తూ తన జీవితాన్ని గడిపేస్తోంది.


అయితే అందం ఏ మాత్రం తగ్గని ప్రియమణి బుల్లితెర ప్రేక్షకులకు సైతం ఆమెను అమితంగా ఆదరిస్తున్నారు. సినిమాలు, బుల్లితెర మాత్రమే కాదండోయ్ కొత్తగా వెబ్ సిరీస్ లలోనూ కనపడబోతోంది ప్రియమణి. అయితే ఇందులో భాగంగా ఫేమస్ బాలీవుడ్ యాక్టర్ మనోజ్ బాజ్‌పేయ్ తో కలిసి ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో నటించింది ఈ అందాల భామ. అయితే ఒక తాజా ఇంటర్వ్యూలో ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి అనుభవాలను ఆమె పంచుకోవడం జరిగింది.


తాను సౌత్ ఇండియా హీరోయిన్ అయినా సరే ఉత్తరాదిలో తనకు బాగా ఆదరణ ఉందని తెలిపింది ప్రియమణి. ఇంత వరకు ఎన్నో నటులను చూశానని కాకపోతే మనోజ్ బాజ్‌పేయ్, రాజు సంజయ్ లాంటి నటులను ఇంతవరకు చూడలేదు అని వారి యాక్టింగ్ స్కిల్స్ చాలా డిఫరెంట్ అని ఆమె తెలిపింది. అంతేకాకుండా మనోజ్ బాజ్‌పేయ్ తో నటించడం ఎంతో మంచి అనుభూతిని ఇచ్చినట్టు తెలిసింది ప్రియమణి.

 

ఇక షూటింగ్ చేస్తున్నప్పుడు ఒక సీన్ చేయడంలో మనోజ్ బాజ్‌పేయ్ కి ఎవరు సాటిరారు అంటూ అలాగే సన్నివేశాల్లో మ్యాజిక్ క్రియేట్ చేయడం ఆయన మాత్రమే చేయగలరు అని చెబుతోంది ప్రియమణి. ఆయన ప్రతిరోజూ ఆ టెంపోనే  రిపీట్ చేస్తూ ఉంటారని ఆయనతో నటిస్తే ఓ విద్యార్థిని ఉపాధ్యాయుడు మధ్య సంబంధంలా అక్కడ అనుభవం పొందవచ్చని తెలిపింది. ఇకపోతే ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ సరసన నారప్ప సినిమాలో ప్రియమణి మళ్లీ టాలీవుడ్ తెరపైకి కనిపించబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: