బాలీవుడ్ లో ఒకేసారి రెండు విషాదాలు చోటు చేసుకున్నాయి.. మొన్న విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూశారు.  ఆయన మరణ వార్త జీర్ణించుకోక ముందే ప్రముఖ నట దిగ్గజం రిషీ కపూర్ ముంబాయి ఆసుప్రతిలో కన్నుమూశారు.  ఆయన మరణ వార్త విన్న భారతీయ చలన చిత్ర రంగం కన్నీటీ పర్యంతం అయ్యారు. సినా, రాజకీయ, వ్యాపార రంగం వారు కన్నీడి వీడ్కోలు పలికారు. ముంబైలోని చందన్‌వాడి శ్మశానవాటికలో ఈయన అంత్యక్రియలు నిర్వహించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఎలాంటి సందడి లేకుండా ఈయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. హాస్పిటల్ నుంచి అంబులెన్స్‌లో శ్మశాన వాటికకు నేరుగా తీసకొచ్చి సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు పూర్తి చేసారు కుటుంబ సభ్యులు.

 

ఆయన పార్థివ దేహాన్ని చూడ్డానికి ఎవరూ రావద్దని ముందుగానే రిషి భార్య నితూ కపూర్ సూచించింది. రణ్‌బీర్ కపూర్ తన తండ్రికి తలకొరివి పెట్టారు. రిషి కపూర్ అంత్యక్రియలో కొంత మంది కుటుంబ సభ్యులు, ఆయన కుటుంబానికి సన్నిహితులైన కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొన్నారు. తన తండ్రిని కడసారి చూసుకోవడానికి ఆయన కూతురు  రిద్ధిమా క‌పూర్ ప్ర‌భుత్వ అనుమ‌తితో ఢిల్లీ నుండి ముంబైకి బ‌య‌లు దేరింది.. కానీ తండ్రి చివరి చూపు చూసుకోలేక పోయింది. అయితే ఈ సమయంలో అలియా ఫోన్ వీడియో లైవ్‌లో అక్క‌డ జ‌రిగిన ప్ర‌క్రియ‌ల‌ని వీక్షించింది. ఓ వైపు కన్నీటి పర్యంతం అవుతుండగా ఆమె వీడియో షూట్ చేయడం ఆశ్చర్యపరిచింది. 

 

ఆమె రావ‌డానికి 18గంటల‌ స‌మ‌యం ప‌డుతుంది. అంత‌సేపు భౌతిక కాయాన్ని ఉంచితే భ‌ద్ర‌తా స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని భావించిన ముంబై పోలీసులు మ‌ధ్యాహ్నం వ‌ర‌కు అంత్య‌క్రియలు పూర్తి చేయమ‌ని ఆదేశించిన‌ట్టు తెలుస్తుంది. అయితే ఆలియా అంత సీరియస్ సమయంలో వీడియో షూట్ చేయడం అందరినీ విస్మయానికి గురి చేసినా.. రిషీ కూతురు కోసం చేసి ఉండవొచ్చని కొంత మంది అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: