స్టార్ హీరో సినిమాకు డైరెక్టర్స్ కన్పార్మ్ అయితే.. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనే దానిపై ఆసక్తి నెలకొంటుంది. మహేశ్ బాబు తర్వాతి మూవీ డైరెక్టర్ గా పరశురామ్ పేరు దాదాపు కన్ఫార్మ్ అయినట్టే. అయితే మ్యూజిక్ డైరెక్టర్ గా మహేశ్ బాబుతో ఇంతవరకు వర్క్ చేయని.. అసలు స్టార్ హీరోతోనే పనిచేయని మ్యూజిక్ డైరెక్టర్ పేరు వినిపిస్తోంది. 

 

సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేశ్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించాల్సి ఉంది. గత మూడు సినిమాలు భరత్ అనే నేను.. మహర్షి.. సరిలేరు నీకెవ్వరుకు దేవిశ్రీ మ్యూజిక్ ఇచ్చాడు. వంశీపైడిపల్లి కూడా దేవిశ్రీనే తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నా.. ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది.

 

అల వైకుంఠపురం.. సరిలేరు నీకెవ్వరు ఒకేసారి సంక్రాంతికి రావడం.. సరిలేరు నీకెవ్వరు కంటే.. అల వైకుంఠపురములో మ్యూజికల్ హిట్ కావడంతో.. సూపర్ స్టార్ తమన్ వైపు మొగ్గు చూపాడని తెలిసింది. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన రెండు సినిమాలు దూకుడు.. బిజినెస్ మేన్ హిట్ అయ్యాయి. దీంతో మరోసారి తమన్ ను సెలక్ట్ చేసుకోవాలని మహేశ్ అనుకున్నాడట. 

 

వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ క్యాన్సిల్ కావడంతో.. సూపర్ స్టార్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ పరశురామ్ కు దక్కింది. దర్శకుడు ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉంటూ మ్యూజిక్ డైరెక్టర్ పై దృష్టిపెట్టాడు. తన లాస్ట్ మూవీ గీత గోవిందంను మ్యూజికల్ హిట్ చేసిన గోపీ సుందర్ ను తీసుకునే ఉద్దేశంలో ఉన్నాడట. ఈ విషయాన్ని మహేశ్ కు సూచన ప్రాయంగా తెలియజేసినా.. ఇంకా ఫైనల్ కాలేదని తెలిసింది. 

 

మహేశ్ సినిమా ఒకే అయితే.. గోపీసుందర్ బంపర్ ఆఫర్ కొట్టినట్టే. తెలుగులో మజిలీ.. నిన్నుకోరి.. మజ్ఞు లాంటి హిట్స్ ఉన్నా.. ఇంతవరకు స్టార్ సినిమాకు మ్యూజిక్ ఇవ్వలేదు. మహేశ్ నటించిన బ్రహ్మోత్సవంకు మిక్కీ జే మేయర్ మ్యూజిక్ ఇస్తే.. గోపీ సుందర్  బ్యాక్ గ్రౌండ్ అందించాడు. ఈ సారి పాటలకు ట్యూన్స్ ఇచ్చే ఛాన్స్ దక్కించుకుంటాడో లేదో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: