ప్రభాస్ సినిమా నిర్మాతలు మనసు మార్చుకున్నారు. లాక్ డౌన్ పొడిగించడంతో స్పీడ్ పెంచారు. లాక్ డౌన్ ఎక్స్ టెండ్ చేస్తే.. ఎక్కడి పనులు అక్కడే ఆగిపోతాయి. కానీ ప్రభాస్ నటిస్తున్న సినిమాకు సంబంధించి ఓ అప్ డేట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. లాక్ డౌన్ ను నమ్ముకుంటే.. అసలుకే మోసం వస్తుందన్న సంగతి యూవీ క్రియేషన్స్ గ్రహించింది. 

 

సాహో తర్వాత ప్రభాస్ జిల్ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో హిస్టారికల్ లవ్ స్టోరీలో నటిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్. కరోనా అప్పుడప్పుడే బలపడుతున్నసమయంలో జార్జియా షెడ్యూల్ మధ్యలోనే ఆపేసి ఇండియా తిరిగొచ్చేశారు. ఆ వెంటనే.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని దర్శకుడు ట్వీట్ చేశాడు. దీంతో ఉగాదికి వస్తుందేమో అని ఆశగా ఎదురుచూశారు. ఫస్ట్ లుక్ ఎప్పుడంటూ నిర్మాతలపై ఒత్తిడి తీసుకొచ్చారు అభిమానులు. దీంతో యూవీ క్రియేషన్స్ స్పందించి ప్రస్తుతం అప్ డేట్ ఏదీ ఉండదని తేల్చి చెప్పేసింది. 

 

కరోనా ప్రభావం తగ్గిన తర్వాత సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇస్తామని నిర్మాతలు చెప్పారు. అయితే లాక్ డౌన్ మే 3 వరకు ఉండటంతో.. ఈ లోగా.. సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్.. లోగో పనులు ఇంట్లోనే ఉంటూ పూర్తి చేసేలా టెక్నీషియన్స్ ను కోరిందట. మే రెండో వారం.. లేదంటే మూడో వారంలో ప్రభాస్ కు సంబంధించి ఫల్ట్ లుక్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేశారు. దీంతో పాటు టైటిల్ ను కూడా ఎనౌన్స్ చేద్దామనుకున్నారు. కానీ లాక్ డౌన్ మే 17వరకు అనగా రెండు వారాల పాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించడంతో నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నారు. 

 

జాన్ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ప్రభాస్.. పూజా హెగ్డే సినిమాకు ఇదే టైటిల్ ఖరారు చేస్తారో.. లేదంటే వేరే టైటిల్ పెడతారో చూడాలి. జాన్ కొత్త షెడ్యూల్ ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేని పరిస్థితి. కరోనా ఎఫెక్ట్ తగ్గినా.. జార్జియాలో ఆపేసిన షెడ్యూల్ పూర్తి చేయాలి. పూజా హెగ్డే ఇతర నటీనటుల డేట్స్ కుదరాలి. ఈ లెక్కలన్నీ వేసుకుంటే.. సినిమా ఈ ఏడాది రావడం కష్టమేనట. 

మరింత సమాచారం తెలుసుకోండి: