బాలీవుడ్ విలక్షణ నటుడు, స్టార్ హీరో ఆమీర్ ఖాన్ ఒకవైపు.. బాహుబలి ప్రభాస్ మరో వైపు.. ఈ ఇద్దరు కలిసి సినిమా చేస్తే.. అబ్బో ఏంటి ఇలాంటి ఓ కాంబినేషన్ అసలు ఎప్పుడు ఊహించలేదు కదా కానీ ఓ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరక్టర్ మాత్రం మల్టీస్టారర్ తీస్తే ఆమీర్ ఖాన్ ప్రభాస్ లతోనే అంటున్నాడు. ఇంతకీ ఎవరా దర్శకుడు అంటే అసలేమాత్రం అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ అందుకున్న ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమా డైరక్టర్ స్వరూప్ అంటున్న మాట ఇది. 

 

మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకోవడమే కాదు కుర్రాడిలో విషయం ఉందని ప్రూవ్ చేసుకున్నాడు. నవీన్ పోలిశెట్టి లీడ్ రోల్ లో వచ్చిన ఈ సినిమా కథ, కథనాలు దర్శకుడి ప్రతిభను చూపించాయి. ఇక ఈ సినిమా తర్వాత ప్రస్తుతం నానితో సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు స్వరూప్. లాక్ డౌన్ టైం లో మీడియాతో ఇంటరాక్ట్ అయిన స్వరూప్ మల్టీస్టారర్ సినిమా చేస్తే ఎన్టీఆర్, అల్లు అర్జున్ లతో చేస్తా అంటున్నాడు. ఆ ఇద్దరిలో సూపర్ డ్యాన్స్ టాలెంట్ ఉంది.. ఏదైనా చేస్తారు అందుకే వాళ్ళిద్దరితో ఒక మల్టీస్టారర్ చేస్తా.. ఇక నేషనల్ వైడ్ గా ఆమీర్ ఖాన్, ప్రభాస్ లతో ఒక క్రేజీ మల్టీస్టారర్ చేస్తా అంటున్నాడు స్వరూప్. 

 

ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమా తీసిన దర్శకుడు ఆమీర్, ప్రభాస్ లతో అది కూడా మల్టీస్టారర్ ఇది జరిగే పనేనా అనుకోవచ్చు. ఏమో ప్రయోగాత్మక సినిమాలు చేసే స్వరూప్ ఆమీర్ ఖాన్ ను మెప్పించే స్టోరీ సిద్ధం చేయొచ్చు. దానికి ప్రభాస్ కూడా ఓకే చెప్పొచ్చు. క్రియేటివ్ ఫీల్డ్ లో ఏది ఎప్పుడైనా జరుగుతుంది.  ఆమీర్, ప్రభాస్ మల్టీస్టారర్ మాత్రమే కాదు ఎన్టీఆర్, అల్లు అర్జున్ మల్టీస్టారర్ తీసినా సరే స్వరూప్ నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్నట్టే లెక్క. 

మరింత సమాచారం తెలుసుకోండి: