యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోలుగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా రౌద్రం రణం రుథిరం. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో దర్శక ధీరుడి ఎస్.ఎస్.రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. బాహుబలి వంటి హిస్టరీ క్రియోట్ చేసిన సినిమా తర్వాత మళ్ళీ భారీ కాన్వాయిస్ తో రాజమౌళి నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన టైటిల్ ఫస్ట్ లుక్ అండ్ రాం చరణ్ వీడియో టీజర్ సినిమా మీద విపరీతమైన క్రేజ్ ని తీసుకు వచ్చాయి.

 

ఇక ఈ నెల ఎన్.టి.ఆర్ బర్త్ డే సందర్భంగా కొమరం భీం పాత్రకి సంబంధించిన వీడియో టీజర్ ని రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే రాజమౌళి టీం ఈ టీజర్ ని తయారు చేసే పనిలో తలమునకలై ఉన్నారట. ఈ వీడియో టీజర్ తో ఆర్.ఆర్.ఆర్ సినిమా ఏంటో ఒక అంచనాకి వచ్చే అవకాశాలున్నాయని తాజా సమాచారం. హై ఓల్టేజ్ లో ఈ టీజర్ ఉండబోతుందట. ఇక ఇప్పటికే తారక్, చరణ్ ఇద్దరు రాజమౌళి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇద్దరు భారీ సక్సస్ లను అందుకొని ఉన్నారు. అది కూడా ఆర్.ఆర్.ఆర్ మీద భారీ అంచనాలు పెరగడానికి ఒక ముఖ్య కారణం.

 

ఇక ఇదిలా ఉంటే ఫిల్మ్ నగర్ లో తాజాగా జరుగుతున్న చర్చల ప్రకారం ఆర్.ఆర్.ఆర్ తర్వాత తారక్ కి పాన్ ఇండియా స్టార్ గా భారీగా క్రేజ్ రానుందని సమాచారం. అంతేకాదు ఆర్.ఆర్.ఆర్ తో మరో ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ టాలీవుడ్ లో కొత్త ఒరవడిని సృష్ఠించబోతున్నారని మాట్లాడుకుంటున్నారు. ఇక ఎన్.టి.ఆర్ కి ప్రభాస్ కి వచ్చినంత క్రేజ్ రాబోతుందని అంటున్నారు.

 

అంతేకాదు ఇప్పటికే తారక్ కి బాలీవుడ్ నుంచి పెద్ద నిర్మాణ సంస్థల నుంచి భారీ బడ్జెట్ ప్రాజెక్ట్స్ ఆఫర్స్ వస్తున్నాయట. ఒకవేళ తారక్ గనక బాలీవుడ్ లో అడుగుపెడితే ఆ రేంజే వేరేగా ఉంటుందని అంటున్నారు. ఈ లెక్కన చూస్తే ఖచ్చితంగా తారక్ ఆర్.ఆర్.ఆర్ తర్వాత ప్రభాస్ ని మించిపోతాడని అంచనా వేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: