టాలీవుడ్ ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను తనదైన శైలిలో తెరకెక్కించడంలో అనిల్ రావిపూడి స్టైలే వేరు. ఒక సినిమా షూటింగ్ జరుగుతుండగానే తన నెక్స్ట్ సినిమా గురించి పూర్తి క్లారిటీ తో ఉంటాడు. ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరొందిన అనిల్ రావిపూడి కి ఇప్పటివరకు బాక్సాఫీస్ దగ్గర ఒక్క ఫ్లాప్ కూడా లేదు. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తీసి అదిరిపోయే హిట్ అందుకున్నాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లోనే కాకుండా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు సృష్టించింది. ఇటువంటి సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నట్లు మొన్నటి వరకు వార్తలు వచ్చాయి.

 

అంతే కాకుండా ఈ సినిమా డివివి దానయ్య నిర్మిస్తున్నట్లు ‘RRR’ తర్వాత ఈ సినిమా ఉండబోతున్నట్లు కూడా ఇలా అనేక రకాల వార్తలు మొన్నటి వరకు వచ్చాయి. అయితే తాజాగా ఫిలింనగర్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి సినిమా తర్వాత రామ్ చరణ్…. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు టాక్. అంతే కాకుండా ఈ సినిమాని మహేష్ బాబు నిర్మించబోతున్నట్లు సమాచారం. గతంలో మహేష్ తో తీయాలనుకున్న సినిమానే చరణ్ తో వంశీ చేస్తున్నారట.

 

ఈ స్క్రిప్ట్ కి చరణ్ అయితే కరెక్ట్ గా సూట్ అవుతాడు అని, అతను ఒప్పుకుంటే నేనే నిర్మిస్తానని మహేష్ బాబు అన్నారట. దీంతో అనిల్ రావిపూడి సినిమా పై ఆశలు పెట్టుకున్న రామ్ చరణ్ ఫ్యాన్స్ కి నిరాశ ఎదురయింది. ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో 'RRR' సినిమా షూటింగ్ లో కొద్ది బ్యాలెన్స్ పాత్ర ఉన్నట్లు సమాచారం. అది అయిన వెంటనే వంశీ పైడిపల్లి స్క్రిప్టు ఓకే అయితే ఆ సినిమా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: