బాహుబలితో తన మార్కెట్ పరిధి పెంచుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆ తర్వాత వచ్చిన సాహో సినిమాతో కూడా బాలీవుడ్ లో మంచి వసూళ్లు రాబట్టాడు. ఆ సినిమాలోని యాక్షన్ సీన్స్ బీ టౌన్ ఆడియెన్స్ కు బాగా నచ్చాయి. అయితే తెలుగు ఆడియెన్స్ కు మాత్రం అది రుచించలేదు. ఇక ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ మూవీకి ఓ డియర్ టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ మూవీ తర్వాత అశ్వనీదత్ ప్రొడక్షన్ లో మహానటి డైరక్టర్ నాగ్ అశ్విన్ తో ఓ క్రేజీ మూవీ ఉంటుందని ఎనౌన్స్ చేశారు. 

 

సైన్స్ ఫిక్షన్ కథతో వచ్చే ఈ సినిమా హాలీవుడ్ సినిమాలు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారు. మహానటితో తన సత్తా ఏంటో చూపించిన దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభాస్ కోసం అదిరిపోయే కథ సిద్ధం చేశాడట. ఈ లాక్ డౌన్ టైం లో ప్రభాస్ సినిమా కథ పూర్తి చేశాడట నాగ్ అశ్విన్. భారీ బడ్జెట్ తో అందరి అంచనాలకు తగినట్టుగా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ఎవడె సుబ్రహ్మణ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయమైనా నాగ్ అశ్విన్ మహానటి సినిమాతో అందరిని ఆశ్చర్యపరిచాడు.

 

ఇక తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రభాస్ తో ఓ ఇంటర్నేషనల్ రేంజ్ మూవీ ప్లాన్ చేశాడు నాగ్ అశ్విన్. తప్పుకుండా తెలుగు సినిమా స్థాయిని పెంచేలా టెక్నీకల్ అడ్వాన్డ్ గా ఈ మూవీ ఉంటుందని చెప్పొచ్చు. ప్రభాస్ చేస్తున్న ఓ డియర్ కూడా సైలెంట్ గా వస్తున్నా ఆ మూవీపై కూడా చాలా నమ్మకంగా ఉన్నారు చిత్రయూనిట్. ఆ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.           

 

మరింత సమాచారం తెలుసుకోండి: