మొన్నటి వరకూ ఎన్టీఆర్ తో సినిమా స్టార్ట్ చేసి నెక్ట్స్ ఇయర్ రిలీజ్ అన్నాడు . నిన్న.. మెగాస్టార్ కోసం మాంచి కథ సిద్దం చేస్తున్నా అన్నాడు . ఇవాళ  వాళ్లిద్దరూ బిజీగా ఉన్నారు . మహేష్ తో సినిమా ప్లాన్ చేస్తున్నా అంటున్నాడు . ఆఖరికి ఈ ముగ్గురిలో ఎవరితో సినిమా ఫైనల్ చెయ్యబోతున్నాడు త్రివిక్రమ్..?

 

త్రివిక్రమ్.. బన్నీతో అలవైకుంఠపురంలో సినిమాతో మంచి సక్సెస్ కొట్టాడు . ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ కంటిన్యూ అవుతుండగానే..ముందుగా అనుకున్నట్టు ఎన్టీఆర్ తో సినిమా అనౌన్స్ చేశాడు త్రివిక్రమ్. ఈ ఏప్రిల్ లో సినిమా స్టార్ట్ చేసి నెక్ట్స్ మేకి రిలీజ్ అని అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు త్రివిక్రమ్. ఇంతకుముందు వీళ్ల కాంబినేషనలో వచ్చిన అరవిందసమేత బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈ సినిమా మీద కూడా మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి ఆడియన్స్ లో .

 

ప్రజెంట్ ఎన్టీఆర్ .. రాజమౌళితో చేస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమా నెక్ట్స్ ఇయర్ కి  పోస్ట్ పోన్ అవ్వడంతో..ప్రస్తుతానికి ఆ కథను పక్కనపెట్టి .. చిరంజీవి కోసం రెడీ చేసుకున్న కథను చెక్కడం మొదలుపెట్టాడు . చిరంజీవి ప్రస్తుతం కొరటాలతో ఆచార్య సినిమా చెయ్యడం, ఈ సినిమాలో చరణ్ యాక్ట్ చెయ్యాల్సి ఉండడంతో పాటు , షూటింగ్ ఇంకా చాలా చెయ్యాల్సి ఉంది. దాంతో ఇప్పుడప్పుడే చిరంజీవి ఫ్రీ అయ్యే ఛాన్స్ లేకపోవడంతో మెగాస్టార్ తో సినిమా కూడా పక్కనపెట్టేశాడు త్రివిక్రమ్ .

 

ఎన్టీఆర్, చిరంజీవి అవైలబుల్ గా ఉండకపోవడంతో ప్రజెంట్ ఖాళీగా ఉన్న మహేష్ బాబు మీద కాన్సన్ ట్రేట్ చేశాడు త్రివిక్రమ్.  మహేష్ కూడా సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మూడు నెలలనుంచి వేరే సినిమా ఏదీ కమిట్ అవ్వలేదు . ఈ సిచ్యవేషన్ లో ఎన్టీఆర్, చిరంజీవి సినిమాలువెనక్కి వెళ్లడంతో త్రివిక్రమ్ కూడా ఖాళీగా ఉండడంతో .. ఈ గ్యాప్ లో మహేష్ తో సినిమా చేద్దామని ప్లాన్ చేస్తున్నాడట త్రివిక్రమ్. అంతకుముందు వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఖలేజా, అతడు ఆడియన్స్ ని బాగా ఎంటర్ టైన్ చేశాయి. మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: