విరాట్ - అనుష్కల పెళ్లి గతేడాది వైభవోపేతంగా జరిగిన వివాహం ద్వారా 'విరుష్క'లు గా మారిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత హీరోయిన్ గా కెరీర్ ఎండ్ అవుతుందని అందరు అనుకుంటున్నారు. కానీ అనుష్క శర్మ విషయంలో అది తప్పని ఋజువు అయింది. పెళ్లి తర్వాత కూడా ఈ భామ వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉంది. అంతేకాదు ఒకవైపు సినిమాలకు సమయం కేటాయిస్తూనే.. భర్తకు చేదోడు వాదోడుగా నిలస్తూ ఆదర్శ పత్ని అనిపించుకోంటుంది. కాగా అనుష్క శర్మ తన జన్మదినాన్ని నిరాడంబరంగా జరుపుకొన్నారు. తన భర్త, క్రికెటర్ విరాట్ కోహ్లితో కలిసి కేక్ కట్ చేసి బర్త్ డేను సెలబ్రేట్ చేసుకొన్నారు.
లాక్ డౌన్ కొనసాగడం.. బాలీవుడ్లో ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్ లాంటి అగ్ర నటులు మరణం చెందడంతో ఆమె విషాదంలో మునిగిపోయారు. ఆ కారణంగా జన్మదిన వేడుకలను హంగామా మధ్య జరుపుకోవడానికి నిరాకరించారు. అనుష్క శర్మ మే 1 తేదీన 32 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ ఎమోషనల్ మెసేజ్ పెట్టాడు. ఇన్స్టాగ్రామ్లో తన భర్తతో కలిసిన దిగిన ఫోటోను షేర్ చేశారు. నీవు నా ప్రపంచంలోకి ప్రేమ అనే కాంతిని తీసుకొచ్చావు. నీ జీవితంలో ప్రతీ రోజు వెలుగు నింపుతున్నావు. ఐ లవ్ యూ అంటూ ఆమె ఓ సందేశాన్ని పోస్టు చేశారు.
గతంలో ఎన్నోసార్లు తన కెరీర్కు అనుష్క ఎంతో సపోర్ట్ ఇచ్చిందని కోహ్లీ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అనుష్కకు కేక్ తినిపిస్తున్న పిక్ ను పోస్ట్ చేశాడు. ఈ ఫొటో పెట్టగానే సోషల్ మీడియాలో వైరలైంది. నిమిషాల వ్యవధిలోనే అభిమానులు లైకులు, కామెంట్లతో హోరెత్తించారు. మరోవైపు క్రికెటర్లు హర్భజన్ సింగ్, కెవిన్ పీటర్సన్, రషీద్ ఖాన్ తదితరులు కూడా అనుష్క శర్మకి శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజు సందర్భంగా ప్రస్తుతం ఆమె చుట్టూ నెలకొన్న పరిస్థితులపై ఆమె కవితా ధోరణిలో భావోద్వేగంగా స్పందించారు అనుష్క. ఈ మేరకు ఓ కవితను రాసి తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశారు. నా చుట్టూ ఉన్న విషాదం దూరం కావాలి.. ఈ కష్టాలన్నీ ఇక శాశ్వతంగా తొలిగిపోవాలి అంటూ ఓ కవితను రాసి తనలోని భావాలను అభిమానులతో పంచుకున్నారు.