స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన సినీ కెరీర్ లో నటించిన అన్ని సినిమాల్లో సరైనోడు చిత్రం అసలు సిసలైన యాక్షన్ ఫిలిం అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి ప్రముఖ మాస్ మసాలా డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు. ఎస్.ఎస్.తమన్ ఈ చిత్రానికి అందించిన మ్యూజిక్ ప్రేక్షకులను ఉర్రతలూగించిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ లో రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ తెస్రా హీరోయిన్ల గా నటించారు.


బన్నీ ఎక్స్ మిలిటరీ మ్యాన్ ఐన 'గన' అనే పాత్రలో నటించగా... ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా ధనుష్ పాత్రలో నటించాడు. ఈ సినిమా విడుదలై 4 ఏళ్లు దాటినా... మొన్న రిలీజ్ ఐన చిత్రం లాగానే చాలా ఫ్రెష్ గా కనిపించడం నిజంగా బోయపాటి శ్రీను, బన్నీ ల మ్యాజిక్ అనే చెప్పుకోవచ్చు. ఆది పినిశెట్టి స్టైలిష్ విలనిజం కూడా సరైనోడు చిత్రానికి ఓ పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. నిజానికి ఈ మూవీ లో అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్ బాడీ తో కనిపించి మాస్ డైలాగులు చెప్తుంటే ఆడియన్స్ సీట్స్ నుండి పైకి లేచి ఈలలు వేశారు. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల కంటే హింది వాళ్లే ఎక్కువగా చూసారు.


ఈ సినిమాలోని డైలాగులు కూడా చాలా బాగున్నాయి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా"ఎర్ర తోలు కదా స్టైల్ గా ఉంటాడు అంకుంటున్నావేమో, మాస్ ఊర మాస్", డైలాగ్ తో పాటు "ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు దమ్ము..ఇక్కడ టన్నులు టన్నులు ఉంది చూస్తవా!! చూస్తావా!!" అంటూ అల్లు అర్జున్ చెప్పిన హాయ్ రాజు సూపర్ హిట్ అయింది. సరైనోడు సినిమా లో అల్లు అర్జున్ చేసిన ఫైట్స్ కూడా విభిన్నంగా ఉన్నాయి. ఈ చిత్రం ద్వారా అల్లు అర్జున్ లోని ఊర మాస్ హీరో పరిచయం అయ్యాడని అభిమానులు చెబుతుంటారు.











మరింత సమాచారం తెలుసుకోండి: