పవన్ కళ్యాణ్ సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తాడని చెప్పినప్పటి నుండి ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ ని వెండితెరపై చూస్తామా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో షూటింగులన్నీ క్యాన్సిల్ కావడంతో పవన్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయమై క్లారిటీ లేదు. అయితే ఇదిలా ఉంటే పవన్- క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న విరూపాక్ష సినిమా  గురించి అనేక రూమర్లు వస్తున్నాయి.

 

 

హీరోయిన్ గా బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నటిస్తుందని అంటున్నారు.  అలాగే ఒకానొక నెగెటివ్ పాత్రలో తమిళ నటుడు శివ కార్తికేయన్ నటించనున్నారని వార్తలు వచ్చాయి . తెలుగులో కౌసల్య క్రిష్ణమూర్తి సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించిన శివ కార్తికేయన్ కి అదే మొదటి తెలుగు సినిమా. అయితే తన రెండవ చిత్రంగా పవన్ కళ్యాణ్ సినిమాలో నటిస్తున్నాడని సోషల్ మీడియా కోడై కూసింది. 

 

విరూపాక్ష పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతుంది కాబట్టి తమిళ ప్రేక్షకులని ఆకర్షించడానికి శివ కార్తికేయని తీసుకున్నారని ప్రచారం జరిగింది. అయితే క్రిష్ సన్నిహితుల సమాచారం ప్రకారం శివ కార్తికేయన్ ని సంప్రదించలేరని చెబుతున్నారు. అసలు సినిమాలో ఆ పాత్ర ఉందా అనే దానిపైనే క్లారిటీ లేదని చెబుతున్నారు. శివ కార్తికేయన్ నటిస్తున్నాడన్న వార్త ఎలా బయటకి వచ్చిందో తెలియట్లేదని చెబుతున్నారట.

 


ఈ మధ్య మన తెలుగు సినిమాల్లో తమిళ హీరోలని నెగెటెవ్ పాత్రల్లో నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కే సినిమాలకి తమిళ ప్రేక్షకుల మద్దరు కోసం తమిళ నటులని తీసుకుంటున్నారు. పవన్ క్రిష్ సినిమాలో మాత్రం శివ కార్తికేయన్ నటిస్తున్నాడని వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలేనని చెబుతున్నారు. వకీల్ సాబ్ షూటింగ్ పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్ విరూపాక్ష చిత్రీకరణలో పాల్గొంటాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: