శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో యువ సామ్రాట్ అక్కినేని నాగ  చైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ లవ్ స్టోరి.  ఈ చిత్రంలో చై కి జోడిగా సాయి పల్లవి నటిస్తుంది. దాంతో ఈ కాంబినేషన్ పై  భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ ను ఏప్రిల్ లో పూర్తి చేద్దామనుకున్నారు కానీ కరోనా వల్ల షూటింగ్ వాయిదాపడింది. ఈ చిత్రానికి మరో 15 రోజుల షెడ్యూల్  మిగిలివుందట. మే లోకూడా షూటింగ్ కు పర్మిషన్ దొరకదు కాబట్టి జూన్ లో పూర్తి చేసి సినిమాను ఆగస్టు లో విడుదలచేయాలని ప్లాన్ చేస్తున్నారు.
 
యూత్ ఫుల్ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చైతన్య , సాయి పల్లవి తెలంగాణ స్లాంగ్ లో డైలాగులు చెప్పనున్నారు. ఏఆర్ రెహమాన్ శిష్యుడు పవన్ సంగీతం అందిస్తుండగా నారాయణ దాస్ నారంగ్,రామ్ మోహన్ రావు  సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే  దాదాపు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పూర్తి చేసుకుందని సమాచారం. మొత్తం థియేట్రికల్ , నాన్ థియేట్రికల్ కలిపి ఈ చిత్రం 50కోట్ల బిజినెస్ చేసిందని వార్తలు వస్తున్నాయి. తద్వారా నాగ చైతన్య కెరీర్ లో హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా లవ్ స్టోరి రికార్డు సృష్టించింది. 
 
ఇక ఈ చిత్రం తరువాత నాగ చైతన్య, గీత గోవిందం ఫేమ్ పరుశురామ్ డైరెక్షన్ లో నటించాల్సి వుంది. అయితే పరుశురాం, మహేష్ బాబు తో సినిమా చేయనుండడం తో ఈ గ్యాప్ లో చైతన్య మరో  డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే పనిలో వున్నాడు. ఇక సాయి పల్లవి మాత్రం తెలుగులో లవ్ స్టోరి తోపాటు వేణు ఉడుగుల డైరెక్షన్ లో విరాటపర్వం అనే చిత్రంలో నటిస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: