మొదటినుంచి మాస్ ప్రేక్షకులను ఎక్కువగా అలరిస్తూ వచ్చాడు చిరంజీవి. అందుకే మాస్ ప్రేక్షకుల్లో చిరంజీవికి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అయితే చిరంజీవి ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలను చేశారు. తనదైన యాక్షన్ తో అదరగొడుతునే  ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే చిరంజీవి ఎన్ని సినిమాల్లో  యాక్షన్ చేసినప్పటికీ చిరంజీవి కెరీర్లో ఇంద్ర సినిమా మాత్రం ప్రేక్షకులకు అభిమానులకు ఇప్పటికి ఫేవరేట్ గానే  నిలిచి పోయింది అన్న విషయం తెలిసిందే. ఇంద్ర సినిమాలో ఫ్యాక్షనిస్ట్ గా చిరంజీవి చేసే యాక్షన్ కి  విజిల్ వేయని ప్రేక్షకులు లేడు అంటే అతిశయోక్తి కాదు. తనదైన డైలాగ్ డెలివరీతో చిరంజీవి ఇంద్ర సినిమాలో నటనతో ఎంతగానో ఆకట్టుకున్నాడు. 

 

 

 అదే సమయంలో ఇంద్ర సినిమాలో పంచ్ డైలాగులు చెబుతూ విలన్ ను చితకబాదేస్తు  ఇక అది చూసిన మాస్ ప్రేక్షకులు అందరూ పండగ చేసుకున్నారు అని చెప్పాలి. ఇంద్ర సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని  సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒరేయ్ వీర శంకర్ రెడ్డి... మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా.. అంటూ పవర్ఫుల్గా చిరంజీవి చెప్పిన డైలాగులు ఇప్పటికీ ఎవర్గ్రీన్ గానే నిలిచిపోయాయి. ఇక ఈ సినిమాలో ఫ్యాక్షనిస్ట్ పాత్రలో చేసిన చిరంజీవి చేసిన యాక్షన్ కైతే ఫిదా అవ్వని  ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి లేదు. 

 

 

 ఈ కుర్చీలో కూర్చో వడానికి ఎవరికీ దమ్ము లేదా అంటూ చిరంజీవి నాన్నమ్మ చెబుతున్న సమయంలో నేనున్నా  నాయనమ్మ అంటూ వచ్చి కుర్చీలో కూర్చునే దగ్గర నుంచి... చివరి వరకు యాక్షన్ సన్నివేశాలలో ఇరగదీశాడు చిరంజీవి. మామూలుగానే చిరంజీవి అంటే యాక్షన్ సన్నివేశాలకు పెట్టింది పేరు. తనదైన వారి యాక్షన్ సన్నివేశాలలో ఇరగదీస్తాడు ఉంటాడు  చిరంజీవి. అందుకే ఇంద్ర సినిమా వచ్చి దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ తెలుగు ప్రేక్షకులకు ఇంకా ఇంద్ర సినిమా లోని యాక్షన్ ఫేవరెట్ గానే ఉంటుంది అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: