పలువురు ఆకతాయిలు పాపులర్ అయ్యేందుకు దొడ్డి దారులు ఎంచుకుంటున్నారు. సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. సెలబ్రిటీల పర్సనల్, ఫ్రొఫెషనల్ కెరీర్స్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే ఈజీగా అందరి దృష్టిలో పడొచ్చు అని భావిస్తున్నారు.
ఇలాంటి సంఘటనలు ఒక్కోసారి ఆ తారలకు తలనొప్పిగా మారుతున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. తాజాగా యంగ్ బ్యూటీ లావణ్య త్రిపాఠికి కూడా ఇలాంటి సమస్యే ఎదురైంది. కొంత కాలం క్రితం సునిశిత్ అనే అతను ఓ యూట్యూబ్ ఛానల్ వారికి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్య్వూలో వన్ నేనొక్కడినే సినిమా నేనే చేయాల్సింది కానీ నన్ను మహేష్ బాబు మోసం చేశాడని చెప్పాడు.
అంతేకాదు మరికొన్ని సినిమాల విషయంలోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. పనిలో పనిగా లావణ్య త్రిపాఠి గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. తను లావణ్యతో డేటింగ్ చేసినట్టుగా, ఆమెకు పలుమార్లు అబార్షన్ కూడా అయినట్టుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు.
ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ కారణంగా సినీ తారలు ఇంటికే పరిమితమవుతున్నారు. దీంతో అభిమానులకు చేరువయ్యేందుకు సోషల్ మీడియా ద్వారా మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ నేపధ్యంలో ఇంటికే పరిమితమైన లావణ్య కూడా మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు అంగీకరించింది.
అయితే ఈ ఇంటర్వ్యూలలో సునిశిత్ వ్యవహారం గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రశ్నలు అడగవద్దని ముందే కండిషన్ పెట్టిందట. ఇంటర్వ్యూలలోనే అవకాశం వస్తే బోల్డ్ క్యారెక్టర్స్లోనూ కనిపించడానికి రెడీ అంటూ క్లారిటీ ఇచ్చేసింది. అందాల రాక్షసి సినిమాతో వెండితెరకు పరిచయం అయిన ఈ భామ తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నా తరువాత ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది.