టాలీవుడ్ లో చాలా తక్కువ కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సాయి పల్లవి చేసిన సినిమాలు తక్కువే అయినా సరే ఆమెకు మాత్రం ప్రత్యేకంగా ఫాలోయింగ్ వచ్చేసింది అనేది వాస్తవం. ప్రస్తుతం ఆమె చేసే సినిమాలు తక్కువగానే ఉన్నా ఆమె సినిమా ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఆమె నటనకు ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అనేది వాస్తవం. ప్రస్తుతం టాలీవుడ్ లో ఆమె కు మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య తో ఒక సినిమా రానా తో ఒక సినిమా చేస్తుంది సాయి పల్లవి. 

 

సినిమా తర్వాత ఆమె ఎన్టీఆర్ తో ఒక సినిమా చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇక ఆమె పుష్ప సినిమాలో కూడా కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ జనాలు అంటున్నారు. పుష్ప సినిమా కోసం ఆమెను దర్శకుడు సుకుమార్ అడగగా ఆమె అందుకు ఓకే చెప్పింది అని సమాచారం. ఈ సినిమా తర్వాత ఆమె ఏ సినిమా చేస్తుంది అనుకునే లోపే మరో సినిమాను కూడా లైన్ లో పెట్టేసింది. రామ్ చరణ్ సినిమాలో కూడా ఆమె నటించే అవకాశం ఉందని అంటున్నారు. 

 

ప్రస్తుతం ఆమె తమిళ సినిమాల్లో చాలా వరకు బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. అక్కడి సినిమాల్లో ఆమె నటించడానికి ఇప్పటికే ఒప్పందాలు కూడా చేసుకుని సిద్దంగా ఉంది. మన తెలుగులో ఆమెకు ఎక్కువగా ఆఫర్లు వస్తున్నాయి. టాలీవుడ్ లో ఆమెకు మంచి డిమాండ్ ఉండటం తో భారీగా పారితోశికం కూడా ఆమె డిమాండ్ చేసింది అని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే సాయి పల్లవి తెలుగులో చేయను అంటూనే దాదాపు నాలుగు సినిమాలు ఓకే చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: