సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఉన్న కోట్లాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రజనీకాంత్ గతంలో నరసింహా, ముత్తు, అరుణా చలం. బాషా లాంటి వరుస హిట్లతో సూపర్ ఫామ్లో ఉన్నప్పుడు ఆయన కు సౌత్ ఇండియాలో పిచ్చ అభిమానులు ఉండేవారు. భాషతో సంబంధం లేకుండా రజనీ సినిమాలు తెగ ఆడేసేవి. ఇలా కేఎస్. రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన నరసింహా సినిమా సైతం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా అన్ని భాషల్లోనూ ఓ రేంజ్లో ఆడేసింది. తెలుగులో కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో సౌందర్య హీరోయిన్ గా నటించగా... రమ్యకృష్ణ చేసిన విలన్ పాత్ర ప్రేక్షకులు ఎప్పటకీ మర్చిపోలేరు.
అయితే ఈ సినిమాలో చాలాసార్లు రజనీతో ఢీ అంటే ఢీ అనేలా నటించిన రమ్యకృష్ణ సినిమాలో రజనీతో పాటు సౌందర్యను తీవ్రంగా అవమానించే సన్నివేశాల్లో నటించారు. సినిమా రిలీజ్ అయ్యాక రమ్యకృష్ణ చెన్నై వెళ్లినప్పుడు రజనీ లేడీ అభిమానులు ఓ హోటల్లో ఉన్న రమ్యపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. సినిమాలో రజనీని అవమానించిన రమ్యను నిజంగా అవమానించాలన్నదే రజనీ మహిళా అభిమానుల ప్లాన్ అట. అంటే రజనీని కనీసం సినిమాలో కూడా అవమానించడం ఆయన మహిళా అభిమానులకు ఎంత మాత్రం నచ్చలేదట. చివరకు ఇది అప్పట్లో పెద్ద సంచలనం అయ్యింది. రజనీ దీనిపై ఇలా చేయవద్దంటూ ప్రకటన చేసే వరకు పరిస్తితి వెళ్లింది.
ఇక రమ్యను అటు సౌందర్య అభిమానులు కూడా వదల్లేదు. సౌందర్య అప్పట్లో సౌత్ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. సౌందర్యను అవమానించిన సీన్లలో రమ్య నటన ఓ రేంజ్లో ఉంది. ఈ క్రమంలోనే రమ్య బయటకు వెళ్లినప్పుడు సౌందర్య అభిమానులు కూడా ఆమెను తీవ్రంగా అవమానించేందుకు పలుసార్లు ప్రయత్నాలు చేశారు. ఇఆ ఆ సినిమాలో నటించినందుకు రమ్యకు ఎంత పేరు వచ్చిందో బయట కూడా అలా అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది.