బాహుబలి ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రభాస్ ప్రస్తుతం రాధాక్రిష్ణ దర్శకత్వంలో పీరియాడికల్ లవ్ స్టోరీని చేస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఎక్కువ భాగం యూరప్ లో జరుపుకోవాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి లేకపోవడంతో షూటింగ్ ని ఇక్కడే కంప్లీట్ చేయనున్నారట. అయితే అదలా ఉంటే తాజాగా ప్రభాస్- నాగ్ అశ్విన్ సినిమా నుండి మరో అప్డేట్ బయటకి వచ్చింది.

 

రాధాక్రిష్ణ దర్శకత్వంలో చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత ప్రభాస్ మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తో సినిమా ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ముందుగా ఈ వార్త బయటకి వచ్చినపుడు అన్నీ పుకార్లేనని కొట్టిపారేసినప్పటికీ, అధికారిక సమాచారం వచ్చేసరికి షాక్ అయ్యారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో అశ్చనీదత్ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రంకోసం సుమారు ఐదు వందల కోట్లు ఖర్చుపెట్టనున్నారట.

 

పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కే ఈ సినిమా అన్ని ప్రధాన భాషల్లో విడుదల కానుంది. నాగ్ అశ్విన్ ఈ సినిమ స్క్రిప్టుని పూర్తి చేశాడట. ప్రభాస్ హీరోగా చేస్తున్న సినిమాలో బాలీవుడ్ నటులని తీసుకోవడం ఆనవాయితీగా మారింది. ప్రభాస్ నేషనల్ స్టార్ అయినప్పటికీ, బాలీవుడ్ నటులని తీసుకుంటే సినిమా రేంజ్ మరింత పెరుగుతుందన్న ఉద్దేశ్యంతో బాలీవుడ్ నటుల మీద దృష్టి పెడుతున్నారు. ప్రస్తుతం నాగ్ అశ్విన్ ఆ పనిమీదే ఉన్నాడట. 

 


సైన్ ఫిక్షన్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటీనటులని సెలెక్ట్ చేసే పనిలో పడ్డాడట నాగ్ అశ్విన్. నటీనటులు, సాంకేతిక నిపుణులు తెలిస్తే సినిమాకి మరింత హైప్ రావడం ఖాయం. టైమ్ ట్రావెలర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: