మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏకంగా నాలుగు దశాబ్దాల పాటు స్టార్ హీరోగా తిరుగులేని మహరాజుగా ఓ వెలుగు వెలుగుతున్నారు. పునాదిరాళ్లు సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన చిరంజీవి ఖైదీ సినిమాతో తిరుగులేని స్టార్ హీరో అయ్యాడు. కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా క్రియేట్ చేసిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ఎన్నో రికార్డులను తిరగ రాసింది. ఈ సినిమాలో మాధవితో పాటు సుమలత హీరోయిన్లుగా నటించారు.
సంయుక్త ఫిలింస్ బ్యానర్పై కేఎల్. నరసారెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ సినిమా చేసేటప్పటికే మాధవి స్టార్ హీరోయిన్. ఆమె గ్లామర్ హీరోయిన్గా పేరు తెచ్చుకోవడంతో పాటు ఆమె కు ఇండస్ట్రీలో ... తెలుగు సినిమా అభిమానుల్లో చాలా మంది ప్రేక్షకులు ఉన్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ టైంలో జరిగిన ఓ సంఘటన మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే పెద్ద అవమానం అన్న టాక్ అప్పట్లో ఉండేది.
చిరంజీవి ని మాధవి షూటింగ్ జరుగుతుండగా కాలితో తన్నారని.. దీనిపై అప్పట్లో సెట్లో ఇద్దరి మధ్య పెద్ద గొడవలే జరిగేవని అన్న ప్రచారం అయితే జరిగింది. కొందరు మాత్రం మాధవి అప్పటికే స్టార్ హీరోయిన్ గా ఉండడంతో చిరు ఆమెను పెద్దగా పట్టించుకోక పోవడంతోనే ఆమె ఇగో హర్ట్ అయ్యే ఆమె కావాలనే తన్నారని చెప్పుకునే వారు... మరి కొందరు మాత్రం మాధవి కాలు అనుకోకుండా తగిలిందని.. అయితే ఇద్దరి మధ్య అప్పటికే ఉన్న ఇగో ప్రాబ్లమ్స్తో ఇది పెరిగి పెద్దది అయ్యిందని.. చివరకు దర్శకుడు కోదండ రామిరెడ్డి ... మిగిలిన వాళ్లు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారన్న టాక్ ఉంది.
ఏదేమైనా ఈ విషయం బయటకు రావడంతో చిరు ఇబ్బంది ఫీలయ్యారు. ఆ తర్వాత చిరంజీవి తిరుగులేని మెగాస్టార్ అయిపోయారు. ఈ సంఘటన మాత్రం అప్పటి నుంచి నేటి వరకు ఏదో ఒకసారి వైరల్ అవుతూనే ఉంది.