ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లాక్ టౌన్ వల్ల ఎంతోమంది సామాన్యుల నుంచి సెలబ్రిటీలు సైతం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అన్ని వ్యవస్థలు ఆగిపోయాయి. ఈ క్రమంలోనే సినిమా షూటింగ్ లు సైతం రద్దు అయ్యాయి. పర్యాటక రంగం ఘోరంగా దెబ్బతింది. అన్నింటికీ మించి పెళ్లిళ్లు కూడా వాయిదా పడ్డాయి. ఈ క్రమంలోనే తెలుగులో అన్ని సినిమాల షూటింగులు రద్దు అవ్వడంతో పాటు... ఇద్దరు ముగ్గురు హీరోల పెళ్లిళ్లు సైతం వాయిదా పడక తప్పలేదు. ఇక యువ హీరో నిఖిల్‌కు విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడడంతో నిఖిల్ తీవ్రమైన ప్ర‌స్టేషన్‌కు వెళ్లి పోయినట్టు సమాచారం.

 

నిఖిల్ కు డా. పల్లవి వర్మతో రెండు నెలల క్రితం నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే.  ఏప్రిల్ 16 న వీరి పెళ్లికి ఏర్పాట్లు కూడా చేశారు. అయితే లాక్ డౌన్ స్టార్ట్ అవ్వ‌డం చేసేదేం లేక ఈ పెళ్లిని నిఖిల్ మే 14వ తేదీకి వాయిదా వేసుకున్నాడు. అప్పటిలోపు ఈ లాక్ డౌన్ ఎత్తేస్తారు అనుకుంటే దాన్ని మరోసారి మే 17 వ తారీఖు వరకూ పొడిగించారు. ఇక ఇప్పుడు లాక్ డౌన్ మే 17 వ‌ర‌కు ఉండ‌నుంది. దీంతో చేసేదేం లేక నిఖిల్ మ‌ళ్లీ త‌న పెళ్లి వాయిదా వేసుకో క త‌ప్ప‌ని ప‌రిస్థితి. 

 

ఈ విష‌యంపై స్పందించిన నిఖిల్ త‌న‌కు చాలా ఫ్ర‌స్టేష‌న్‌గా ఉంద‌ని వ్యాఖ్యానించాడ‌ట‌. అయినా చేసేదేం లేద‌ని.. ఇప్పుడు బ‌య‌ట ఉన్న ప‌రిస్థితుల్లో ఇంత‌కన్నా పెద్ద స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి ఉంద‌ని కూడా అన్నట్టు స‌మాచారం. ఏదేమైనా నిఖిల్ ఇప్ప‌టికే రెండు సార్లు వాయిదా ప‌డిన త‌న పెళ్లిని క‌రోనా లాక్ డౌన్ నేప‌థ్యంలో ముచ్చ‌ట‌గా మూడోసారి వాయిదా వేసుకోక త‌ప్ప‌డం లేదు.

 

నిఖిల్ మాత్ర‌మే కాదు... మ‌రో టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ పెళ్లి సైతం ఎంగేజ్ మెంట్ అయ్యి క‌రోనా నేప‌థ్యంలో వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: