నిధి అగర్వాల్.. 'మున్నామైఖెల్‌'తో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన నిధి తొలి సినిమాతోనే అందాలు ఆరబోస్తూనే తన డాన్సులతో అదరగొట్టింది. అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన 'సవ్యసాచి' చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత అఖిల్ హీరోగా వచ్చిన 'మిస్టర్ మజ్ను' చిత్రంలోనూ నటించింది. ఈ రెండు చిత్రాలు పెద్దగా విజయం సాధించకపోయినా టాలీవుడ్ లో తన పేరు గుర్తుండిపోయేలా చేసాయి. గత ఏడాది డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో రామ్ హీరోగా వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' మూవీలో నటించిన నిధి అగర్వాల్ ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ చిత్రంతో హీరోయిన్ గా తన నటనతో మంచి మార్కులే కొట్టేసింది. దీంతో ఈ బ్యూటీకి ఆఫర్లు వెల్లువెత్తాయి. ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లాతో ఒక సినిమాలో.. తమిళ్ లో జయం రవి సరసన 'భూమి' చిత్రంలో నటిస్తోంది. 

 

అయితే ప్రస్తుతం లాక్ డౌన్ అమల్లో ఉండగా ఇంట్లోనే ఉన్న నిధి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించింది. ఈ మేరకు అనేక ఆసక్తికర విషయాలకు వెల్లడించింది. నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఏ మాత్రం తడుముకోకుండా ఇస్మార్టుగా ఆన్సర్స్ ఇచ్చింది. ఈ మేరకు ఆమె చెప్పిన కొన్ని సమాధానాలతో ఫోన్‌ లోని సీక్రెట్స్ బయట పడ్డాయి. ఈ మేరకు స్క్రీన్ లాక్ పిక్.. వాట్సప్ డీపీ.. చివరగా వాడిన యాప్ ఏది అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఏ మాత్రం ఇబ్బంది పడకుండా నిధి అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఓ నెటిజన్ ఇంటర్‌లో ఎంత పర్సెంటీజీ వచ్చిందని అడగ్గా.. 87 శాతం అని తెలిపింది. దీన్ని బట్టి చూస్తే అందమే కాదు.. చదువుల్లోనూ నిధి పాప ఇస్మార్టే అని తెలుస్తోంది. ఈ విధంగా తన ఫాల్లోవెర్స్ అడిగిన ప్రతీ ప్రశ్నకు సమాధానం చెప్పి వారిని ఆశ్చర్యపరిచింది. అంతేకాకుండా మీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా అనే ప్రశ్నకు సమాధానంగా నేను సింగల్ అని.. ఇంకా ఎవరితో మింగల్ అవలేదని.. ఎవరితో డేటింగ్ కూడా చేయడం లేదని సమాధానం చెప్పింది. కాగా గత కొన్ని రోజులుగా ఈ ఇస్మార్ట్ బ్యూటీ క్రికెటర్ రాహుల్ తో ఎఫైర్ నడిపిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: