కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో సెలబ్రెటీలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఎప్పుడూ బిజీగా ఉండే హీరోలు కూడా ఇప్పుడు ఖాళీ అయిపోయారు. తమకు దొరికిన ఈ అవకాశంతో కుటుంబంతో హాయిగా గడిపేస్తున్నారు. ఇప్పటి వరకు ఫ్యామిలీతో మిస్ అయిన సమయాన్ని అంతా ఇప్పుడు కవర్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు. సినిమాల షూటింగ్స్ తో క్యాలెండర్ మొత్తం ఫుల్ బిజీగా ఉండే సినీ స్టార్స్ అంతా ఇలా మూడు వారాల పాటు ఎటు వెళ్లకుండా ఇంట్లోనే టైం స్పెండ్ చేయడంతో వారి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఫ్యామిలీ అంటే ప్రాణమిచ్చే సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే కరోనా నేపథ్యంలో వచ్చిన అనుకోని సెలవులను అదిరిపోయేలా వాడుకుంటున్నాడు. ముందే ఈ లాక్ డౌన్ సమయంలో ఏమి చేయాలని టైం టేబుల్ వేసుకున్నాడు మహేష్. ఈ విషయాన్ని స్వయంగా సూపర్ స్టార్ భార్య నమ్రత శిరోద్కర్ ట్విట్టర్ లో చెప్పారు. షూటింగ్స్ సమయంలో ఆయనకు పిల్లలతో గడిపే సమయం దొరకదు.. అందుకే ఈ కరోనా తీసుకొచ్చిన హాలీడేస్ను పూర్తిగా పిల్లలకే ఇచ్చేసాడు మహేష్ అంటుంది నమ్రత. ప్రస్తుతం పిల్లలు సితార, గౌతమ్లతో మహేష్ బాబు ఆడుకుంటున్నాడని.. అలాగే కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు ఏవీ వదలకుండా చూస్తున్నాడని చెప్పింది ఈమె. అన్నింటికంటే ముఖ్యంగా సితార అయితే తండ్రిని ఒక్క క్షణం కూడా వదలడం లేదని చెబుతుంది. ఈ రోజు వరల్డ్ లాఫర్ డే సందర్భంగా మరో పోస్ట్ తో ముందుకు వచ్చాడు మహేష్.
Live a little...
— mahesh babu (@urstrulyMahesh) May 3, 2020
Love a little...
Laugh a little...
every moment, every day!! ❤️❤️❤️ #WorldLaughterDay #stayhomestaysafe pic.twitter.com/oLoquNQ6IB
ప్రతి సంవత్సరం మే నెల మొదటి ఆదివారంను ప్రపంచ నవ్వుల దినోత్సవంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా ప్రముఖులు కూడా సంతోషంగా నవ్వుతూ ఉన్న ఫోటోలని షేర్ చేస్తున్నారు. తాజాగా మహేష్ బాబు కూడా తన తనయుడు గౌతమ్తో కలిసి నవ్వుతున్న ఫోటో ఒకటి షేర్ చేశాడు. 'ప్రతి క్షణం.. ప్రతి రోజు.. నవ్వుతూ హ్యాపీగా ఉండాలని' కామెంట్ పెట్టాడు. ఇంట్లోనే ఉంటూ సేఫ్ గా ఉండమని సూచించాడు. ఈ ఫోటో చూసిన సూపర్ స్టార్ అభిమానులు మీరు అలాగే ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉండాలని కామెంట్స్ పెడుతున్నారు. మొత్తం మీద ఈ లాక్ డౌన్ సమయాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడని చెప్పవచ్చు. ఇప్పుడు మహేష్ పెట్టిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక సినిమాల విషయానికొస్తే ఈ ఏడాది ప్రారంభంలో 'సరిలేరు నీకెవ్వరూ'తో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసిన మహేష్ ప్రస్తుతం తన కెరీర్లో 27వ సినిమా పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహించనున్నారు. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత ఈ సినిమా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.