అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రావడానికి గానూ రెడీ అవుతున్నారు. ఈ సినిమా చిత్తూరు జిల్లాలో ఉన్న ఎర్ర చందనం స్మగ్లర్ల జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు టాలీవుడ్ జనం. ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు కథను సిద్దం చేస్తున్నారు. ఇటీవల ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేసారు. దీనికి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ కుంటి వాడిగా నటించే అవకాశం ఉందని టాలీవుడ్ జనం అంటున్నారు. 

 

సినిమా కోసం అల్లు అర్జున్సినిమా కథ కూడా వినడం లేదని అంటున్నారు. ఈ సినిమా కోసం వేరే సినిమాలను కూడా అతను దాదాపుగా పక్కన పెట్టారని అంటున్నారు. ఈ సినిమా లో అల్లు అర్జున్ పాత్రకు విలన్ గా ఎవరు నటించే అవకాశం ఉంది అనే దాని మీద చర్చలు జరుగుతున్నాయి. బాలీవుడ్ విలన్ ని ఈ సినిమాకు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. బాలీవుడ్ లో ఒక విలన్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఆయనకు ఇప్పటికే కథ కూడా చెప్పారని ఆ కథ అతనికి నచ్చింది అని అంటున్నారు. 

 

అయితే పారితోషికం ఎక్కువగా తీసుకునే సూచనలు ఉన్నాయని సమాచారం. ఒకటికి పది సార్లు ఆలోచించి తీసుకోవాలని అయితే ఆ విలన్ సదరు సినిమాను బాలీవుడ్ లో ప్రచారం చేసే అవకాశం ఉందని అందుకే ఆ విలన్ మీద ఎక్కువగా ఆధారపడినట్టు తెలుస్తుంది. త్వరలోనే చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసే సూచనలు ఉన్నాయి. కాగా ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ బాలీవుడ్ లో ఒక రీమేక్ సినిమా చేయనున్నాడు. అలాగే క్రిష్ తో ఒక సినిమా చేసే సూచనలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: