టాలీవుడ్ హీరోలు ఇప్పుడు మార్కెట్ కోసం వినూత్నంగా ఆలోచన చేసే ప్రయత్నం చేస్తున్నారు. అగ్ర హీరోల నుంచి చిన్న హీరోల వరకు అందరూ కూడా ఇప్పుడు మార్కెట్ ని దేశ వ్యాప్తంగా విస్తరించడానికి గానూ ఎప్పటికప్పుడు సరికొత్తగా ఆలోచనలు చేస్తున్నారు. తమ పరిధి దాటి ఆలోచనలు చేసే ప్రయత్నం చేస్తున్నారు కథ కమర్షియల్ గా ఉంటే తమకు కలిసి వస్తుంది అని భావిస్తున్నారు. అగ్ర హీరోలు చిన్న హీరోలు అందరూ కూడా ఇప్పుడు ఇదే ప్రయత్నంలో ఉన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మార్కెట్ మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. 

 

మన తెలుగులో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సహా కొందరు హీరోలు ఇప్పుడు కొత్తగా ఆలోచనలు చేయడం మొదలుపెట్టారు. ఇక నుంచి నిర్మాతల మీద ఆధారపడకుండా సినిమాలను తామే నిర్మించాలి అని భావిస్తున్నారు. రామ్ చరణ్ ఎన్టీఆర్ సినిమాను నిర్మించే ప్రయత్నం చేయగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇప్పుడు మహేష్ బాబు సినిమాను నిర్మించడానికి ఆలోచనలో ఉన్నాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇక ప్రభాస్ కూడా అనుష్క సినిమా మీద ఫోకస్ చేసినట్టు సమాచారం. ఎన్టీఆర్ ఇప్పటికే కొందరు దర్శకులతో టచ్ లోకి కూడా వెళ్ళాడు. 

 

ఇక యువ హీరోలు కూడా ఇప్పుడు మల్టీ స్టారర్ సినిమాల మీద ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నారు. సినిమా హిట్ అయితే తాము ఇక భారీ సినిమాలు చేద్దామని ఆలోచనాలో ఉన్నారు. ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా హీరోలు అందరూ కూడా కాళీ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఖాళీ సమయాన్ని ఈ విధంగా వాడుకుని కథలకు సంబంధించిన చర్చలు పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు ఫలితాన్ని ఇస్తుంది అనేది చూడాలి. చిన్న హీరోలు కూడా మార్కెట్ ని ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: