బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ ఆలియా భట్ కు జనరల్ నాలెడ్జ్ కొంచెం తక్కువేమో ఉండొచ్చు కానీ.. మానవత్వం ఆమెలో అపారంగా ఉంది. అందంలోనే కాదు అందమైన మనసులోనూ ఆమెకు ఆమే సాటి. ఆపదలో ఉన్న వాళ్ల కన్నీళ్లు తుడిచి అక్కున చేర్చుకునే విషయంలో ఆమె ఎప్పుడూ ముందు ఉంటుంది. అయితే నెటిజన్లు మాత్రం ఆలియా భట్ మనస్తత్వాన్ని సరిగా అర్థం చేసుకోకపోగా పైగా ఎగతాళి చేస్తున్నారు. అసలు విషయం తెలుసుకోకుండా.. రిషి కపూర్ అంత్యక్రియల సమయంలో ఫోన్ వాడిందని విమర్శిస్తున్నారు. 

 

రిషికపూర్ మరణ వార్త ఎపుడైతే తెలిసిందో అప్పటి నుంచి ఆ కుటుంబాన్నే విడిచివెళ్లడం లేదు ఆలియాభట్. రణ్ బీర్ కపూర్, నీతూ కపూర్ ను ఓదార్చడమే కాకుండా.. వాళ్లలో ధైర్యం నింపుతోంది. ఆ కుటంబంలో కన్నీటి బరువును తగ్గించేందుకు తనవంతు తీవ్రంగా కృషిచేస్తోంది. అయితే రిషి కపూర్ కు అంతిమ సంస్కారాలు చేస్తున్నపుడు ఆలియా భట్ ఫోన్ వాడిందని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. 

 

రిషికపూర్ కూతురు రిధిమా కపూర్ కుటుంబం దేశ రాజధాని ఢిల్లీలో నివాసం ఉంటుంది. అయితే లాక్ డౌన్ కారణంగా ఆమె తండ్రి రిషి కపూర్ అంత్యక్రియలకు రాలేకపోయింది. చివరిచూపులు కూడా ఆమెకు దక్కలేదు. ఎయిర్ పోర్టులు మూతపడ్డాయి. విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. అంతర రాష్ట్రాలే కాదు.. అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా నిలిచిపోయాయి. రోడ్డు మార్గం గుండా వెళ్దామన్నా.. వాహనాల రాకపోకలకు నిషేధం కొనసాగుతుండటంతో సరైన సమయంలో ముంబయికి చేరుకోలేకపోయింది. 

 

రణ్ బీర్ కపూర్ బరువెక్కిన గుండెలతో.. తండ్రి కోల్పోయిన బాధతో.. కన్నీళ్లను విడుస్తూ.. హిందూ సంప్రదాయం ప్రకారం తన తండ్రి రిషి కపూర్ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఆ సమయంలో రిషికపూర్ కూతురు రిధిమకు వీడియో కాల్ చేసింది ఆలియా భట్. తండ్రికి నిర్వహించే అంతిమ సంస్కారాలను ఫోన్ ద్వారా కళ్లకు కట్టింది. ఈ విషయం తెలుసుకోని నెటిజన్లు ఆమెను అపార్థం చేసుకుంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: