కొన్ని రోజులుగా ట్విట్టర్ లో టాలీవుడ్ కి సంబంధించి ‘బి ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్ ట్రెండింగ్ అనే చెప్పాలి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రారంభించిన ఈ ఛాలెంజ్ ను చిరంజీవితో సహా అనేకమంది సెలబ్రిటీలు పాటించారు. దీంతో ఈ ఛాలెంజ్ చాలా వైరల్ అయింది. వీరిలో మ్యూజిక్ సెన్సేషన్ దేవీశ్రీ ప్రసాద్ కూడా ఉన్నాడు. కాస్త.. వెరైటీగా ప్లాన్ చేసి చేసిన ఈ వీడియోకు మంచి అప్లాజ్ వచ్చింది. ఇప్పుడు ఏకంగా యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ ఈ వీడియో గురించి దేవీకి ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందించడం విశేషం.

 

 

‘బి ద రియల్ మ్యాన్ ఛాలెంజ్’ లో భాగంగా నేను చేసిన ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇండస్ట్రీ నుంచి సుకుమార్, హరీశ్ శంకర్, ప్రభుదేవా, శ్రుతి హాసన్.. తో సహా చాలామంది అభినందించారు. కానీ అన్నిటికంటే సంతోషాన్నిచ్చిన విషయం కమల్ హాసన్ గారు ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందించడం చాలా ఆనందాన్ని ఇస్తోంది. తల్లి ప్రేమను జోడిస్తూ తీసిన ఈ వీడియో ఆయనకు బాగా నచ్చిందని చెప్పారు. తల్లి ప్రేమకు మించింది లేదు’ అని తన భావాలు పంచుకున్నారని చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

 

 

దేవీశ్రీని కమల్ అభినందించడంపై ప్రముఖ ఫిలిం జర్నలిస్ట్ రింకూ గుప్తా ఆర్టికల్ రాసి తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ కు దేవీశ్రీ ప్రసాద్ స్పందించాడు. ‘తల్లికి మించింది మరేదీ లేదు. ప్రతి కుటుంబానికి తల్లి అండ, దీవెనలే ముఖ్యం. వాళ్లకు మనం తగిన గుర్తింపును ఇవ్వాల్సిందే’ అని కూడా చెప్పాడు. ఛాలెంజ్ వీడియోలో దేవీ తన మాతృమూర్తిపై ఉన్న ప్రేమను చూపించడం అందరినీ ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: