టాలీవుడ్ లో కలెక్షన్ కింగ్ గా మంచి పేరు సంపాదించుకున్న హీరో మోహన్ బాబు. ఇప్పుడు ఆయన వయసు మీద పడటం తో సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన వరుసగా సినిమాలు చేసే అవకాశం లేదనే విషయం అర్ధమవుతుంది. ఇప్పుడు ఆయన నిర్మాత గా కొన్ని సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు షార్ట్ ఫిలిమ్స్ ని చెయ్యాలని చూస్తున్నట్టు సమాచారం. తన కుమార్తె మంచు లక్ష్మి తో కలిసి సినిమాలు చెయ్యాలని ఆలోచనలో ఉన్నారట. యువ దర్శకులతో కలిసి ఈ సినిమాలు చేస్తారట. 

 

ఆయన చిన్న కొడుకు మంచు మనోజ్ కూడా ఇప్పుడు సినిమాల్లో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే ఇక మంచు విష్ణు కూడా ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నాడు. కొన్ని సినిమా కథలను అతను విని ఓకే చేసినట్టు సమాచారం. ప్రస్తుతం అతను చేసే సినిమాల మీద ప్రేక్షకులకు కూడా అంత ఆసక్తి లేదు అనే మాట అక్షరాల నిజం దీనితో చాలా జాగ్రత్తగా సినిమాలు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పుడు మంచు లక్ష్మి తండ్రి సినిమాలకు సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది అని తమిళంలో తన తండ్రికి ఆసక్తి ఉంది కాబట్టి అక్కడి సినిమాలను చేసే ఆలోచనలో ఆమె ఉందని అంటున్నారు. 

 

ప్రస్తుతం మోహన్ బాబు చిరంజీవి సినిమాలో కూడా ఒక పాత్ర చేసే అవకాశం ఉందని సమాచారం. ఆచార్య సినిమాలో ఆయన నటిస్తారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. చేస్తారా లేదా అనేది ఇంకా స్పష్టత రావడం లేదు. మోహన్ బాబు చేసే సినిమాలకు ఇప్పుడు అంత ప్రాధాన్యత లేకపోయినా ఆయన సినిమాలు చెయ్యాలి అని చూస్తున్నారు. మరి ఇది ఎంత వరకు ఫలిస్తుంది అనేది చూడాలి. ప్రస్తుతం మంచు మనోజ్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: