అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా మూడు సినిమాలు తీసినా పెద్దగా వర్క్ అవుట్ అవలేదు. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను మూడు సినిమాల్లో ఒక్కటి కూడా కమర్షియల్ సక్సెస్ అవలేదు. ప్రస్తుతం అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు అఖిల్. బొమ్మరిల్లు, పరుగు సినిమాలతో సక్సెస్ అందుకున్న భాస్కర్ రామ్ హీరోగా ఒంగోలు గిత్త సినిమా చేశాడు. ఆ సినిమా పెద్దగా వర్క్ అవుట్ అవలేదు. 

 

ఇక చాలా గ్యాప్ తర్వాత అఖిల్ తో బ్యాచ్ లర్ సినిమా చేస్తున్నాడు బొమ్మరిల్లు భాస్కర్. ఈ సినిమా కథ కథనాలు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారట. సినిమాతో ఎలాగైనా అఖిల్ కు హిట్ ఇచ్చి తీరాల్సిందే అన్నట్టుగా చిత్రయూనిట్ ఉన్నారట. ఈ మూవీని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసి నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో అఖిల్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. 

 

వరుస స్టార్ సినిమాలతో పాటుగా ఆ సినిమాలను సక్సెస్ చేసుకుంటూ టాలీవుడ్ లో సూపర్ ఫామ్ లో ఉన్న పూజా హెగ్డే అఖిల్ సినిమాకు లక్ గా మారనుందని అంటున్నారు. అఖిల్, పూజా హెగ్డే పెయిర్ సినిమాకు చాలాక్రేజీగా ఉండబోతుందని తెలుస్తుంది.  సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ ఎట్రాక్షన్ కానుందని తెలుస్తుంది. పూజా హెగ్డే గ్లామర్ షో కూడా సినిమాకు ప్లస్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. అక్కినేని హీరో నాగ చైతన్య సరసన ఒక లైలా కోసం సినిమాలో నటించిన పూజా హెగ్డే ఆ సినిమాతో హిట్ కొట్టలేదు. మరి అన్నతో వర్క్ అవుట్ కాలేదు కాబట్టి తమ్ముడితో పూజా హెగ్డే హిట్టు కొడుతుందో లేదో చూడాలి.        

మరింత సమాచారం తెలుసుకోండి: