డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రామ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళని సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. గతేడాది విడుదలై ఎక్కువ లాభాలను తీసుకొచ్చిన సినిమాల లిస్ట్ లో ‘ఇస్మార్ట్ శంకర్’ ముందు నిలవడం విశేషం. చాలా రోజుల తర్వాత మాస్ ఆడియన్స్‌ని ఇస్మార్ట్ శంకర్ విపరీతంగా ఆకట్టుకుంది. పూరి సినిమాని జనాలు చాలా రోజుల తర్వాత థియేటర్లలో విజిల్స్, గోల చేస్తూ ఎంజాయ్ చేశారని చెప్పాలి. ఇక ఎనర్జటిక్ హీరో రామ్ కెరీర్‌లో కూడా మొదటి సారొ భారీగా వసుళ్ళు రాబట్టిన సినిమా కూడా ఇస్మార్ట్ శంకర్ కావడం విశేషం. 

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో చేసిన టెంపర్ తర్వాత వరసగా ఫ్లాప్స్ తో సతమతమవుతూ నష్ఠాలల్లో కూరుకుపోయిన పూరీ జగన్నాథ్‌కు ఈ సినిమా నిర్మాతగా, దర్శకుడిగా మంచి లాభాలని తీసుకొచ్చింది. ఇక రామ్ కూడా కొన్నేళ్ళుగా ఫ్లాప్స్ తో అవస్థలు పడ్డాడు. కాని ఆ ఇబ్బందులని ఇస్మార్ట్ శంకర్ తీర్చేసింది. ఇదే ఊపుతో మరోసారి ఊర మాస్ క్యారెక్టర్ తో మళ్ళీ సక్సస్ కొట్టాలన్న కసితో రెడ్ అన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

 

కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాని జూలై లో రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది రెడ్. ఇస్మార్ట్ శంకర్ వంటి సూపర్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అదే మ్యాజిక్ ని రిపీట్ చేస్తూ బ్లాక్ బస్టర్ అందుకోవాలనుకున్నాడు. కాని కరోనా రామ్ కి గట్టి షాకిచ్చింది. ప్రస్తుతం నెలకొన్న లాక్ డౌన్ పరిస్థితుల దృష్ఠ్యా థియోటర్స్ ఇప్పట్లో ఓపెన్ అయ్యో అవకాశాలు లేవని అర్థమవుతుంది.

 

అదీకాక ఈ సినిమాని ఆగస్ట్ వరకు రిలీజ్ చేయరన్న టాక్ కూడా వినిపిస్తుంది. దీంతో రాం కి వచ్చిన క్రేజ్ నిలబడుతుందా అన్న సందేహాలు కొందరిలో మొదలయ్యాయని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: