సూపర్ స్టార్ మహేష్ బాబు 2020 ప్రారంభంలోనే మాస్ హిట్ అందుకున్నాడు. అల్లు అర్జున్ తో పోటీ పడి నువ్వా నేనా అన్నట్టు సాగిన రసవత్తర పోటీలో ఇద్దరు భారీ హిట్స్ ని తమ ఖాతాలో నమోదు చేసుకున్నారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి బరిలో దిగి సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత వంశీపైడిపల్లి దర్శకత్వం లో నటిస్తాడని అనుకున్నారు. అంతేకాదు ఈ సినిమాని వేసవి సెలవుల్లో రిలీజ్ చేయాలని సన్నాహాలు చేశారు. అయితే అనూహ్యంగా ఈ సినిమా నుండి మహేష్ బాబు తప్పుకున్నాడు.

 

ఇక ఈ సినిమా లేకపోవడంతో మహేష్ బాబు ఎఫ్ 3 తో సెట్స్ మీదకి వెళతాడని ఆల్రెడి ఈ సినిమాకి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వచ్చాయి. కాని ఈ సినిమా కి సంబంధించిన స్క్రిప్ట్ ఇంకా సిద్దం కాలేదట. పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ రెడీ అయినా కరోనా ప్రభావం ఎలా ఉంటుందో చూశాకే అనిల్ రావిపూడి ఈ సినిమాని మొదలుపెడతాడని తనే స్వయంగా వెల్లడించారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో మహేష్ బాబు నటిస్తున్నాడని ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయిందని చెప్పుకొచ్చారు. కాని ప్రస్తుతం కరోనా కారణంగా పరిస్థితులు మారిపోవడంతో బడ్జెట్ ని కంట్రోల్ చేయడానికి మహేష్ బాబు కాకుండా రాం చరణ్ ప్రాజెక్ట్ లోకి తీసుకువస్తున్నారట.  

 

ఇక గత కొన్ని రోజులుగా మహేష్ బాబు పరశురాం కాంబినేషన్ లో సినిమా మొదలవబోతుందన్న వార్త కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో నిర్మించబోయో సినిమాని 2020 ఆఖరున రిలీజ్ కూడా అనుకున్నారట. అయితే ఈ సినిమాకి సంబందించిన తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా పరశురాం మహేష్ బాబు సినిమా మే 31 న ప్రారంభం కానుందట.

 

అయితే కేవలం పూజా కార్యక్రమాలనే నిర్వహించనున్నారని సమాచారం. షూటింగ్ మొదలవడానికి మాత్రం  ఇంకాస్త సమయం పడుతుందని అందుకు కారణం స్క్రిప్ట్ పూర్తి స్థాయిలో సిద్దం కాకపోవడమేనట. మహేష్ బాబు రీసెంట్ గా కథ లో కొన్ని కీలక మార్పులు చెప్పగా పరశురాం ఆ మార్పులను దిద్దే పనిలో ఉన్నాడట. అందుకే సినిమా సెట్స్ మీదకి వెళ్ళేందుకు సమయం పడుతుందని లేటెస్ట్ న్యూస్. దీన్ని బట్టి చూస్తే 2020 లో మహేష్ బాబు రానట్టే అని అర్థమవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: