దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌ డౌన్ సమయంలో ఇంట్లోనే ఖాళీగా కూర్చున్న సెలెబ్రెటీలు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్ లో ఉంటూ వినోదాన్ని పంచుతున్నారు. కొంతమంది హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ హీట్ పెంచేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే హీరోయిన్లు రకరకాల పోస్టులతో ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ తన ఫోటోలను పోస్టు చేస్తూ వస్తోంది. ఇప్పుడు తాజాగా హలో యాప్ కోసం కియారా చేసిన ఫోటోషూట్ పిక్స్ బయటకి వచ్చాయి. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన అవుట్ పిట్స్ తో సమ్మర్ లో ఇంకొంచెం వేడిని పుట్టిస్తోంది కియారా. 

 

 

కియారా అద్వానీ సినీ కెరీర్ విషయానికొస్తే 'భరత్ అనే నేను' చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలుగులో తొలి సినిమాతోనే సూపర్ స్టార్ మహేష్ సరసన నటించి సూపర్ హిట్ అందుకుంది. ఆ ఒక్క సినిమాతో అమ్మడికి టాలీవుడ్ లో  స్టార్ హీరోయిన్ గుర్తింపు అభించింది. అదే ఊపుతో వెంటనే రామ్ చరణ్ 'వినయ విధేయ రామ' సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. అయితే ఆ సినిమాలో మంచి నటనతో పాటు అందచందాలు తగిన మోతాదుల్లో ఆరబోసినా.. సినిమాలో స్టోరీలో బలం లేక బాక్సాఫీస్ దగ్గర భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో ఆ సినిమా తర్వాత నుండి తెలుగులో మరో సినిమా చేయలేదు కియారా.

 

 

అయితే హిందీలో మాత్రం వరుసగా అవకాశాలు అందుకుంటూ అదరగొడుతోంది. ఈ బ్యూటీ హిందీలో 'లస్ట్ స్టోరీస్' అనే నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లో నటించింది. ఆ వెబ్ సిరీస్‌లో కాస్తా ఘాటుగానే నటించి అందరి దృష్టిని ఆకర్షించింది కియారా. ఆ తర్వాత అర్జున్ రెడ్డి హిందీ రీమేక్‌లో నటించి బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకుంది. కియారా ప్రస్తుతం 'భూల్ భులయ్యా 2' 'లక్ష్మి బాంబ్' 'షేర్ షా' 'ఇందూ కీ జవానీ' సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అంతేకాకుండా సూపర్ స్టార్ నెక్స్ట్ సినిమాలో నటించే అవకాశం ఉందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: