గుణశేఖర్... ఈ పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరికీ సుపరిచితమే. ఒకప్పుడు భారీ చిత్రాలకు పెట్టింది పేరుగా గుణశేఖర్ పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. చూడాలని ఉంది, ఒక్కడు, అర్జున్ కొన్ని సినిమాల కోసం ఆయన వేసిన సెట్టింగ్స్ నిజానికి అప్పట్లో సంచలనమే సృష్టించారు. ప్రస్తుతం రోజుల్లో టాలీవుడ్ లో సెట్స్ ఈ రేంజ్ లో ఉండడానికి కారణం గుణశేఖర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పట్లోనే కొన్ని కోట్లు ఖర్చుపెట్టి భారీ సెట్టింగ్స్ ను చేయించిన ఘనత గుణశేఖర్. అయితే రుద్రమదేవి చిత్రం తర్వాత ఇప్పటివరకు ఆయన సినిమాని పట్టాలెక్కించ లేదు.

 


ఇక ఆ తర్వాత రుద్రమదేవి సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతాపరుద్రుడు అనే సినిమాను చేస్తానంటూ ప్రకటించాడు. మరల ఆ తరువాత దగ్గుబాటి రానా తో హిరణ్యకశిప చిత్రం చేస్తానంటూ తెలిపాడు. 150 కోట్ల భారీ బడ్జెట్ తో సురేష్ బాబు అలాగే ఒక ప్రముఖ హాలీవుడ్ బ్యానర్ తో కలిసి ఆ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆ సినిమా గురించి ఇప్పటి వరకు ఒక్క విషయం బయటికి రాలేదు అలాగే సినిమా మొదలు కాలేదు.

 


సినిమా గురించి ఎప్పుడు అడిగినా అదిగో ఇదిగో అంటున్నారు తప్ప అసలు విషయాన్ని మాత్రం తెలియడం లేదు దర్శకుడు గుణశేఖర్. అయితే ఈయన ఇటీవల మీడియాతో మాట్లాడుతూ హిరణ్యకశిప సినిమా ఆగిపోలేదని గ్రౌండ్ వర్క్ జరుగుతోందని తెలుపుతున్నాడు. అయితే దర్శకుడు ఈ మాట చెప్పడం ఇదే మొదటిసారి కాదు. గత మూడు సంవత్సరాలుగా ఇదే ఈ మాట చెబుతూ వస్తున్నాడు. దీనితో ఆ సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తి మొత్తం పోయిందనే చెప్పవచ్చు. ఇక ఈ సినిమా ఈ సంవత్సరం కరోనా నేపథ్యంలో అసలు మొదలు కాకపోవచ్చు. నిజానికి రుద్రమదేవి సినిమా వచ్చి ఇప్పటికి ఐదు సంవత్సరాలు దాటినా ఇంకా సినిమాను చేయకపోవడంతో అభిమానులు గుణశేఖర్ పై అసహనంతో ఉన్నారు అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: