తెలుగు లో భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ భారీ సెట్టింగులతో సినిమాలు చేయడంలో ఆయనకు పెటింది పేరు. తెలుగులో చూడాలని ఉంది, ఒక్కడు , అర్జున్ వంటి భారీ సినిమాలకు దర్శకత్వం వహించి అప్పట్లో రికార్డు సృష్టించాడు. భారీ సెట్టింగులు కోసం అప్పట్లోనే కోట్లు ఖర్చు పెట్టిన ఘనత ఈ డైరెక్టర్ ది. ఇప్పటి సినిమాలలో భారీ సెట్టింగులు నిర్వహిస్తున్నారంటే ఈయన చలువే. రాణి రుద్రమదేవి సినిమా తరువాత గుణశేఖర్ మరో ప్రాజెక్టును ఇప్పటివరకు ప్రకటించలేదు. గుణశేఖర్ సినిమా రిలీజ్ ఐన సందర్భంలో ప్రతాపరుద్రుడు సినిమాను చేస్తానని ప్రకటించిన గుణశేఖర్ ఆపై యూటర్న్ తీలుస్కొని హీరో రానా తో హిరణ్య కశిప సినిమాను చేస్తున్నట్లు ప్రకటించాడు,

IHG'Hiranyakashyapa' with <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=RANA' target='_blank' title='rana- గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>rana</a> Daggubati ...

ఈ సినిమాను నిర్మాత సురేష్ తో కలసి 150 కోట్ల భారీ బడ్జట్ తో ఈ సినిమాను నిర్మించాలని అనుకున్నారు. కాని ఇప్పటి వరకు సినిమా గురించి కనీసం ఒక్క అడుగు అంటే ఒక్క అడుగు కూడా ముందుకు పడ్డట్లుగా అనిపించడం లేదు. అయితే గుణశేఖర్ ఈమధ్య కనపడ్డప్పుడు హిరణ్యకశిప ప్రారంభిస్తున్నారా లేక షూటింగ్ ఆగిపోయిందా అని అభిమానులు అడుగగా దానికి గుణశేఖర్ సినిమా ఆగిపోలేదు ఇంకా ఆ సినిమాకి సంభందించిన వర్క్ జరుగుతోంది అని సమాధానం ఇచ్చాడు అయితే ఫాన్స్ మాత్రం ఈ మాట 3 సంవత్సరాలనుండి చెబుతున్నారు అని ఆ సినిమాగురించే అడగడం మానేశారు. కరోనా కారణంగా ఎలాగూ సినిమా సెట్స్ పైకి వెళ్ళదు అదేవిధంగా ఏడాది గడుస్తుంది కొత్తఏడాదిలో కూడా ఇదే చెబుతాడేమో అని ప్రేక్షకులు కామెట్స్ మీద కామెంట్స్ పెడుతున్నారు . రుద్రమదేవి సినిమా వచ్చి అయిదు సంవత్సరాలు దాటినా ఇంకా సినిమాను చేయకపోవడంను గుణశేఖర్‌ తప్పిదంగా విమర్శలు వస్తున్నాయి.

 
 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: