కొన్ని కొన్ని సార్లు అదృష్టం ఎటు నుంచి వస్తుందో తెలియదు కానీ వచ్చి లాగి పెట్టి కొట్టేస్తుంది అదృష్టం. అది  అదృష్టం వచ్చింది అంటే కొన్ని కొన్ని సార్లు మనం నమ్మలేని పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. కేరళకు చెందిన ఓ మధ్యతరగతి కుటుంబీకులు బతుకుదెరువు కోసం ఎడారి దేశం బాట పట్టాడు. అక్కడికి వెళ్లి ఏదో చిన్నాచితక పని చేసుకునేవాడు. అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఇంట్లోనే ఉండడంతో కుటుంబ భారం మొత్తం అతనే మోసేవాడు. కష్టాల కడలిలో కుటుంబం మొత్తం సాగుతూ ఉండేది. అదేంటోగాని దేవుడు అతనికి అడగకుండానే వరమిచ్చాడు. ఒక్కరోజులో కోటీశ్వరుడయ్యాడు. 

 

 

 ఒక్క రోజులో కోటేశ్వరుడు అవడం ఏంటి అని షాక్కి గురయ్యారా...  షాక్ అయినా ఇది మాత్రం నిజమే... అదెలా సాధ్యమైందో ఓసారి వివరాల్లోకి వెళితే మీకే అర్థమవుతుంది. కేరళకు చెందిన దిలీప్ కుమార్ పరమేశ్వరన్ కు  ఒక భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబంతో సహా ఏడు సంవత్సరాల క్రితమే అజ్మల్ వెళ్ళాడు ఈ వ్యక్తి. స్థానికంగా ఉన్న ఆటో స్పేర్ పార్ట్స్ కంపెనీలో సేల్స్ మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. భార్యకు ఎలాంటి ఉద్యోగం లేదు ఇంట్లోనే ఉండడంతో ఇంటి భారం మొత్తం ఈ ఒక్క వ్యక్తి మోయాల్సిన పరిస్థితి వచ్చింది. అష్టకష్టాలు పడుతూ కుటుంబ భారాన్ని మోస్తూ వస్తున్నాడు. 

 

 

 ఇంతలోనే అదృష్టం వచ్చి అరచేతిలో వాలిపోయింది ఆ వ్యక్తికి .. ఏప్రిల్ 14న ఆన్లైన్ లో లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు సదరు వ్యక్తి. ఇక ఈ లాటరీ టికెట్ డ్రా ను ఆదివారం రోజు తీశారు. ఇక ఈ లాటరీ డ్రా లో దిలీప్ కుమార్ జాక్పాట్ కొట్టేశాడు. అబుదాబి బిగ్ టికెట్ ధరలు ఏకంగా 20.63 మూడు కోట్ల గెలిచాడు ఆ వ్యక్తి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆ వ్యక్తి సంతోషం పట్టలేక పోతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. తనకు ఒక్కసారిగా లాటరీలో ఇంత డబ్బు రావడంతో సంతోషం పట్టలేక పోతున్నానని..ఈ డబ్బుతో అప్పులు  తీర్చడం తోపాటు తన పిల్లల భవిష్యత్తు మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ఉపయోగిస్తాను అంటూ పేర్కొన్నాడు ఆ వ్యక్తి.

మరింత సమాచారం తెలుసుకోండి: