దేశ వ్యాప్తం గా లాక్ డౌన్ కొన సాగుతున్న నేపథ్యం లో సినీ తారలు ఇళ్లకే పరిమిత మైన సంగతి తెలిసిందే.. అయితే ఈ లాక్ డౌన్ ఇళ్లలోనే ఉంటూ తాము ఎలా చేసుకుంటున్నారు అనే సంగతి అభిమానుల తో పంచుకుంటున్నారు.. కుటుంబ సభ్యుల తో సరదాగా గడుపుతున్నారు. వంట గదిలో ప్రయోగాలు చేస్తున్నారు. వీటన్నిటినీ సోషల్ మీడియా ద్వారా అభిమాను లతో పంచుకుంటున్నారు. 

 

 

 

 

 

 

కొంత మంది స్టార్లు ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ నిర్వహించి అభిమానులు అడిగిన ప్రశ్నల కు సమాధానాలు ఇస్తున్నారు. మరికొంత మంది ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవుతున్నారు. తాజా గా చార్మింగ్ బ్యూటీ రాశీ ఖన్నా ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. 

 

 

 

 

అయితే, ఈ ఇంటరాక్షన్‌లో రాశీ ఖన్నా కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఆమె చెప్పిన మాటలు ఆయన అభిమానులను విపరీతంగా ఆకట్టకున్నాయి. అల్లు అర్జున్ గురించి ఏమైనా చెప్పండి అని ఒక అభిమాని అడగగానే.. ‘‘ఆయన చుట్టూ ప్రతి ఒక్కరినీ ఎంతో ప్రోత్సహిస్తుంటారు. ఆయన నటన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన పక్కన నటించడం కూడా ఎంతో ఇష్టం’’ అని రాశీ చెప్పుకొచ్చారు. అలాగే, మహేష్ బాబుతో కలిసి పనిచేయాలని తాను వేచిచూస్తున్నానని..

 

 

 

ఊహలు గుస గుస లాడే సినిమాతో పరిచయమైన రాశిఖన్న ఆ సినిమా హిట్ అవ్వడంతో ఇప్పుడు వరుస సినిమాలలో నటిస్తుంది..ఇటీవల ఈ అమ్మడు నటించిన ప్రతిరోజూ పండగే..వెంకీ మామ సినిమాలు నటించింది.. ఆ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.. ఇప్పుడు మరో రెండు సినిమాలలో నటించనుంది... ఇంతవరకు బన్నీ సరసన నటించని ఈ ముద్దుగుమ్మ త్వరలోనే నటిస్తానని చెప్పుకొచ్చింది..  

మరింత సమాచారం తెలుసుకోండి: