పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచేశాడు. ఇప్పుడు ఆయన్ను ఆపడం ఎవరివల్ల కాదు అనేలా ఉన్నాడు. ఇప్పటి వరకు సంవత్సరానికి ఒక మూవీ ప్లాన్ చేసే పవర్ స్టార్ ఇప్పుడు ఏకకాలంలో నాలుగు సినిమాలను ట్రాక్ ఎక్కించేస్తున్నాడు. ఒక మూవీ షూటింగ్ జరుపుకుంటుందో లేదో అపుడే మరో మూడు సినిమాలకు ఒప్పందం చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. 

 

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో నుంచి ఎప్పుడైతే మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడో అప్పటి నుంచి ఆయన పంథా మారిపోయింది. రాజకీయాల్లోకి రాకముందు సంవత్సరానికి ఒక సినిమా చేసే పవన్ కళ్యాణ్.. సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చాడో లేదో అపుడే తన క్యారెక్టర్ మార్చేసుకున్నాడు. ఏ హీరోకూ తీసిపోని విధంగా కొత్త కొత్త ప్రాజెక్టులను ఒకే చేస్తూ ఫ్యాన్స్ లో మాంచి జోష్ నింపుతున్నాడు. ప్రస్తుతం వకీల్ సాబ్ షూటింగ్ జరుపుకుంటుంగా.. ఇది అయిపోతుందో లేదో అపుడో మరో మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 


పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీ తర్వాత క్రిష్ డైరెక్షన్ లో ఓ పీరియాడికల్ మూవీకి సిద్ధమయ్యాడు. ఈ సినిమా ఔరంగజేబు కాలం నాటి కథాంశంతో వస్తుందని వినికిడి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ తరహా క్యారెక్టర్ లో ఒదిగిపోనున్నాడని సమాచారం. అందులో పొలిటికల్ సెటైర్స్ కూడా ఉంటాయని సమాచారం. 

 

అంతేకాదు పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలోనూ ఓ మూవీ చేయబోతున్నట్టు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ లో ఈ మూవీ వెండితెరకెక్కనుంది. గబ్బర్ సింగ్ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న ఈచిత్రం పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఉంటుందని సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్ మొదలు కావడానికి ఒక సంవత్సరం అయితే పట్టొచ్చు. 


ఇక డాలీ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఇప్పటికే గోపాలా.. గోపాలా.. కాటమరాయుడు అనే రెండు సినిమాలు చేశాడు. గోపాలా గోపాలా సమయంలో ఆయన పనికి మెచ్చిన పవన్ కళ్యాణ్ మరోసారి ఆయనతో సినిమా చేస్తాడని సమాచారం.  సర్ధార్ గబ్బర్ సింగ్ తో బోల్తాపడిన బాబీ.. ఇపుడు సొంత కథతో మరో సినిమాను చేయనున్నట్టు సమాచారం. ఆ సినిమాలో కథానాయకుడిగా పవన్ కళ్యాణ్ ను ఎంచుకున్నట్టు టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: